Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mexico Gun Attack: మెక్సికోలో డ్రగ్ కార్టెల్స్ (ముఠా హింస) మరోసారి రక్తపాతం సృష్టించాయి. మెక్సికో తూర్పు – మధ్య రాష్ట్రమైన ప్యూబ్లాలోని టెహుయిట్జింగో పట్టణంలో సాయుధ దుండగులు జరిపిన ఘోర కాల్పుల్లో ఒక చిన్నారితో సహా 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తెల్లవారుజామున ఒక నివాస గృహమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ప్యూబ్లా ప్రజా భద్రతా సంస్థ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి
స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం.. మరణించిన వారిలో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో పాటు ఒక చిన్నారి ఉన్నారు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు సమాచారం అందించడంతో మున్సిపల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలైన ఒక మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసింది. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు ఎవరు? వారి మోటివ్ ఏంటి? అనే విషయాలను స్థానిక అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ ఘాతుకంపై ఫెడరల్ అధికారులు, నేషనల్ గార్డ్ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
భయంతో పారిపోతున్న వందలాది కుటుంబాలు
మధ్య మెక్సికోలో ఇటీవల కాలంలో కార్టెల్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రరూపం దాల్చింది. ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా పెరిగిన హింస కారణంగా స్థానిక ప్రజల్లో భయాందోళనలు తీవ్రం అవుతున్నాయి. దీంతో వారు వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇప్పటికే సుమారు 800 నుంచి 1,000 కుటుంబాలు వారి ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస పారిపోయారు. ఇంతటి దారుణమైన ఘటన జరిగినప్పటికీ ప్యూబ్లా గవర్నర్ అలెజాండ్రో అర్మెంటా ఇప్పటివరకు దీనిపై స్పందించకపోవడం గమనార్హం.
వరుస హత్యలతో అల్లాడుతున్న ప్యూబ్లా
చాలాకాలంగా ఈ ప్రాంతం ముఠా హింసతో అట్టుడుకుతుంది. తాజాగా జరిగిన దాడి ఈ ఏడాది ప్యూబ్లా రాష్ట్రంలో జరిగిన మూడో పెద్ద సాయుధ దాడిగా చెబుతున్నారు. ఫిబ్రవరిలో ప్యూబ్లాలోని ‘హుహుఎట్లాన్ ఎల్ గ్రాండే’ నగరంలో దుండగుల చేతిలో ఆరుగురు హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్యూబ్లా రాజధాని నగరంలో ఒక వాహనంపై జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ముఠా హింసను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని భద్రతా సంస్థలు స్పష్టం చేశాయి.
తాజావార్తలు
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!