Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mexico Gun Attack: మెక్సికోలో డ్రగ్ కార్టెల్స్ (ముఠా హింస) మరోసారి రక్తపాతం సృష్టించాయి. మెక్సికో తూర్పు – మధ్య రాష్ట్రమైన ప్యూబ్లాలోని టెహుయిట్జింగో పట్టణంలో సాయుధ దుండగులు జరిపిన ఘోర కాల్పుల్లో ఒక చిన్నారితో సహా 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తెల్లవారుజామున ఒక నివాస గృహమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ప్యూబ్లా ప్రజా భద్రతా సంస్థ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి
స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం.. మరణించిన వారిలో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో పాటు ఒక చిన్నారి ఉన్నారు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు సమాచారం అందించడంతో మున్సిపల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలైన ఒక మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసింది. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు ఎవరు? వారి మోటివ్ ఏంటి? అనే విషయాలను స్థానిక అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ ఘాతుకంపై ఫెడరల్ అధికారులు, నేషనల్ గార్డ్ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
భయంతో పారిపోతున్న వందలాది కుటుంబాలు
మధ్య మెక్సికోలో ఇటీవల కాలంలో కార్టెల్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రరూపం దాల్చింది. ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా పెరిగిన హింస కారణంగా స్థానిక ప్రజల్లో భయాందోళనలు తీవ్రం అవుతున్నాయి. దీంతో వారు వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇప్పటికే సుమారు 800 నుంచి 1,000 కుటుంబాలు వారి ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస పారిపోయారు. ఇంతటి దారుణమైన ఘటన జరిగినప్పటికీ ప్యూబ్లా గవర్నర్ అలెజాండ్రో అర్మెంటా ఇప్పటివరకు దీనిపై స్పందించకపోవడం గమనార్హం.
వరుస హత్యలతో అల్లాడుతున్న ప్యూబ్లా
చాలాకాలంగా ఈ ప్రాంతం ముఠా హింసతో అట్టుడుకుతుంది. తాజాగా జరిగిన దాడి ఈ ఏడాది ప్యూబ్లా రాష్ట్రంలో జరిగిన మూడో పెద్ద సాయుధ దాడిగా చెబుతున్నారు. ఫిబ్రవరిలో ప్యూబ్లాలోని ‘హుహుఎట్లాన్ ఎల్ గ్రాండే’ నగరంలో దుండగుల చేతిలో ఆరుగురు హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్యూబ్లా రాజధాని నగరంలో ఒక వాహనంపై జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ముఠా హింసను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని భద్రతా సంస్థలు స్పష్టం చేశాయి.
తాజావార్తలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
-
Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
-
Peddi : ‘పెద్ది’ బాలీవుడ్ పరిస్థితి ఏంటి.. ఓపెనింగ్ లేకుంటే చరణ్ పాన్ ఇండియా కెరీర్ కష్టమే?
-
BCCI Meeting: సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం?.. బీసీసీఐ సమావేశంలో హాట్ టాపిక్!
-
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్షిప్పై షాకింగ్ ట్విస్ట్..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..