Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mexico Gun Attack: మెక్సికోలో డ్రగ్ కార్టెల్స్ (ముఠా హింస) మరోసారి రక్తపాతం సృష్టించాయి. మెక్సికో తూర్పు – మధ్య రాష్ట్రమైన ప్యూబ్లాలోని టెహుయిట్జింగో పట్టణంలో సాయుధ దుండగులు జరిపిన ఘోర కాల్పుల్లో ఒక చిన్నారితో సహా 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తెల్లవారుజామున ఒక నివాస గృహమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ప్యూబ్లా ప్రజా భద్రతా సంస్థ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి
స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం.. మరణించిన వారిలో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో పాటు ఒక చిన్నారి ఉన్నారు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు సమాచారం అందించడంతో మున్సిపల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలైన ఒక మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసింది. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు ఎవరు? వారి మోటివ్ ఏంటి? అనే విషయాలను స్థానిక అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ ఘాతుకంపై ఫెడరల్ అధికారులు, నేషనల్ గార్డ్ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- Benjamin Netanyahu: అమెరికా ఒప్పందం చేసుకున్నా తగ్గేదేలే.. ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్..
- US-Iran శాంతి ఒప్పందం.! పెట్రోల్ నుంచి హోం లోన్ వరకు.. భారతీయులకు ఎలాంటి ప్రభావం పడనుందంటే.!
- G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్పై కీలక వ్యాఖ్యలు
- Ethiopia: ఇథియోపియాలో ఘోర బస్సు ప్రమాదం.. 31 మంది మృతి
భయంతో పారిపోతున్న వందలాది కుటుంబాలు
మధ్య మెక్సికోలో ఇటీవల కాలంలో కార్టెల్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రరూపం దాల్చింది. ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా పెరిగిన హింస కారణంగా స్థానిక ప్రజల్లో భయాందోళనలు తీవ్రం అవుతున్నాయి. దీంతో వారు వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇప్పటికే సుమారు 800 నుంచి 1,000 కుటుంబాలు వారి ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస పారిపోయారు. ఇంతటి దారుణమైన ఘటన జరిగినప్పటికీ ప్యూబ్లా గవర్నర్ అలెజాండ్రో అర్మెంటా ఇప్పటివరకు దీనిపై స్పందించకపోవడం గమనార్హం.
వరుస హత్యలతో అల్లాడుతున్న ప్యూబ్లా
చాలాకాలంగా ఈ ప్రాంతం ముఠా హింసతో అట్టుడుకుతుంది. తాజాగా జరిగిన దాడి ఈ ఏడాది ప్యూబ్లా రాష్ట్రంలో జరిగిన మూడో పెద్ద సాయుధ దాడిగా చెబుతున్నారు. ఫిబ్రవరిలో ప్యూబ్లాలోని ‘హుహుఎట్లాన్ ఎల్ గ్రాండే’ నగరంలో దుండగుల చేతిలో ఆరుగురు హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్యూబ్లా రాజధాని నగరంలో ఒక వాహనంపై జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ముఠా హింసను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని భద్రతా సంస్థలు స్పష్టం చేశాయి.
తాజావార్తలు
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
-
Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
-
Whale Graveyard : నీటి అట్టడుగున 53 లక్షల సంవత్సరాల నాటి తిమింగలాల శ్మశాన వాటిక… ఎక్కడుందో తెలుసా ?
-
Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
-
CM Chandrababu: సింగపూర్లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకావిష్కరణ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?