Maldives: నీటి సర్వేపై భారత్తో ఒప్పందాన్ని పునరుద్ధరించుకోం.. మాల్దీవుల ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవుల్లో చైనా అనుకూల వ్యక్తి మహ్మద్ ముయిజ్జు అధ్యక్షుడు కాగానే.. భారత వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్నాడు. ఇప్పటికే ద్వీపదేశంలో ఉన్న భారత సైనికులను వెళ్లాల్సిందిగా కోరాడు. ఇప్పుడు మరో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాడు. భారత్తో కలిసి మాల్దీవులు చేస్తున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని ఆ దేశం చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. మాల్దీవుల పబ్లిక్ పాలసీ అండర్ సెక్రటరీ మహ్మద్ ఫిరుజుల్ మాట్లాడుతూ.. ‘హఫ్తా-14’ రోడ్ మ్యాప్లో భాగంగా దేశ సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేసే ఇతర దేశాలతో ద్వైపాక్షిక, దౌత్య ఒప్పందాలను రద్దు చేస్తున్నామన్నారు.
Read Also: Uttar Pradesh: మైనర్పై అత్యాచారం.. బీజేపీ ఎమ్మెల్యేకి 25 ఏళ్ల జైలు శిక్ష
Also Read
- Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
- SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
- US - Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
- Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
గురువారం క్యాబినెట్ సమావేశం అనంతరం మాల్దీవుల అధ్యక్ష కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం ఫిజురుల్ మాట్లాడారు. భారతదేశం-మాల్దీవుల మధ్య హైడ్రోగ్రఫీ ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని మాల్దీవుల అధ్యక్షుడు మరియు అతని మంత్రివర్గం నిర్ణయించుకున్నారని, ఒప్పందం ప్రకారం జూన్ 2024లో గడువు ఉంది. దీనిని పునరుద్ధరించకూడదని మాల్దీవులు అనుకుంటోంది. జూన్ 8, 2019న ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటన సందర్భంగా హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ ఒప్పందం ప్రకారం.. మాల్దీవుల పరిధిలోని సముద్ర జలాల్లో, రీఫ్స్, లాగూన్స్, కోస్ట్ లైన్స్ వెంబడి ప్రాదేశిక జలాలపై సమగ్ర అధ్యయనం చేయడానికి భారత్కి అనుమతి ఉంది.
కొత్తగా బాధ్యతలు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మయిజ్జు ఇప్పటికే మాల్దీవుల్లో భారత సైనికులు ఉనికి ఉండకూడదని అన్నారు. ఇదే సమయంలో తాము ఇతర దేశాల సైనికులకు ఆహ్వానం పలకమని చెప్పారు. తాను అధ్యక్షుడినైతే, మాల్దీవుల సార్వభౌమత్వాన్ని కాపాడుతానని, భారత సైనికులను వెళ్లగొడతాననే హామీ ఇచ్చాడు. దీంతో భారత వ్యతిరేక విధానాలకు తెరతీశారు.
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
-
Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
-
Tollywood: పర్సంటేజీ ఇష్యూ.. శిరీష్ రెడ్డికి మైత్రి రవి స్ట్రాంగ్ కౌంటర్
-
India-Russia: సంక్షోభం వేళ భారత్కు రష్యా భరోసా..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!