Maldives: మాల్దీవుల మాజీ మంత్రి సోషల్ మీడియా పోస్ట్ వైరల్.. భారత్కి క్షమాపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: లక్షద్వీప్ పర్యటన సమయంలో భారత్ ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యల చేసి మాజీ మంత్రి మరియం షియునా మరోసారి వివాదాస్పద పోస్టు చేశారు. భారత జాతీయ జెండాలో అశోక చక్రాన్ని పోలి ఉన్న గుర్తుతో, మాల్దీవులు ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండీపీ)పై సోషల్ మీడియాలో చేసిన పోస్టు సంచనలనంగా మారింది. అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆమె భారతదేశానికి క్షమాపణలు చెప్పారు. ‘‘ నా ఇటీవల సోషల్ మీడియా పోస్టు విమర్శలకు దారి తీసింది. ఈ పోస్టు వల్ల ఏదైనా గందరగోళం లేదా నేరం జరిగినే నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అని మరియం షియునా అన్నారు. ఈమె అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూకు చెందిన పార్టీకి చెందిన వ్యక్తి.
‘‘మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ ఎండీపీని ఉద్దేశించి చేసిన ట్వీట్ భారతీయ జెండాను పోలి ఉందని నా దృష్టికి వచ్చిందని, ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ఏదైనా అపార్థానికి కారణమైతే నేను హృదయపూర్వకంగా చింతిస్తున్నాను’’అని ఆమె వ్యాఖ్యానించింది. మాల్దీవులుకు భారత్తో ఉన్న సంబంధాన్ని ఎంతో గౌరవంగా భావిస్తామని, భవిష్యత్తులో సోషల్ మీడియా కంటెంట్ విషయంలో అప్రమత్తంగా ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
- Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!

మరియం షియునా చేసిన పోస్టు మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ గుర్తు దిక్సూచి, అశోక చక్రాన్ని పోలి ఉంది. దీంతో మరోసారి ఆమెపై భారతీయులు విరుచుకుపడ్డారు. భారత్, మాల్దీవులకు నిత్యావసరాలను సరఫరా చేసేందుకు అంగీకరించిన తర్వాత ఆమె ఈ పోస్టు చేసింది. మహ్మద్ ముయిజ్జూ ఆ దేశ అధ్యక్షుడైన తర్వాత భారత్ తో సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. చైనా అనుకూలంగా వ్యవహరిస్తుండంపై భారత్ ఆగ్రహంగా ఉంది.
గతంలో ప్రధాని మోడీ లక్షదీవుల పర్యటన సమయంలో మంత్రిగా ఉన్న మరియం షియునా, ప్రధానిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇజ్రాయిల్ తోలుబొమ్మ’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. దీంతో ఆమెను మంత్రి వర్గం నుంచి తీసేశారు. ఈమెతో పాటు భారత్పై నోరు పారేసుకున్న మరో ఇద్దరు మంత్రుల్ని కూడా సస్పెండ్ అయ్యారు.
తాజావార్తలు
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
-
Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!