Malala Yousafzai: పాలస్తీనా కోసం రూ.2.5 కోట్ల విరాళం ప్రకటించిన మలాలా యూసఫ్జాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malala Yousafzai: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దారుణమైన దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 1400 మందిని క్రూరంగా చంపేశారు. 200 మందిని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు వారిని గాజాలోకి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే హమాస్ ఎటాక్ తర్వాత ఇజ్రాయిల్ వైమానిక దళం గాజా స్ట్రిప్ పై విరుచుపడుతోంది. ఇప్పటి వరకు ఈ దాడుల్లో 3000 మంది మరణించారు. ఇందులో సాధారణ పౌరులతో పాటు పిల్లలు కూడా ఉన్నారు.
మరోవైపు మంగళవారం గాజా నగరంలోని ఓ ఆస్పత్రిలో జరిగిన దాడిలో 500 మంది మరణించారు. ఈ దాడిని ప్రపంచం మొత్తం ఖండించింది. అయితే ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడి వల్లే ఇంత మంది చనిపోయారని హమాస్ ఆరోపించగా.. హమాస్ ఉగ్రవాదులు జరిపిన రాకెట్ దాడి విఫలం కావడంతోనే అల్-అహ్లీ ఆస్పత్రిలో పేలుడు జరిగిందని ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది.
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
Read Also: Hate Crime: తలపాగా ధరించినందుకు సిక్కు యువకుడిపై దాడి..
ఈ దాడిపై నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ స్పందించారు. పాలస్తీయన్ల కోసం రూ.2.5 కోట్లను విరాళంగా అందించారు. గాజాలోని అల్-అహ్లీ ఆస్పత్రిపై జరిగిన బాంబుదాడిని చూసి నేను భయపడిపోయానని, దీన్ని ఖండిస్తున్నానని ఆమె ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇజ్రాయిల్-పాలస్తీనా శాంతి కోసం నా గొంతును జోడిస్తున్నానని, సామూహిక శిక్ష పరిష్కారం కాదని, గాజాలో ఉన్న జనాభాలో సగం మంది 18 ఏల్ల కంటే తక్కువ వయసు ఉన్న వారే, వారు తమ మిగిలిన జీవితాన్ని బాంబుదాడుల మధ్య జీవించకూడదని మలాలా అన్నారు.
ఈ సంక్షోభ సమయంలో పాలస్తీనా ప్రజల కోసం సాయం చేసే మూడు స్వచ్ఛంద సంస్థలకు తాను రూ. 2.5 కోట్లు విరాళంగా ఇస్తానని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తక్షణ కాల్పుల విరమణకు, శాశ్వత శాంతి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?