Nepal: నేపాల్ నిరసన వెనక పెద్ద కుట్ర, కాల్పులకు ఆదేశాలు ఇవ్వలేదు: మాజీ ప్రధాని ఓలి..
- ప్రజల్ని ఉద్దేశించి నేపాల్ మాజీ ప్రధాని సోషల్ మీడియా పోస్ట్..
- నిరసనల్లో చొరబాటుదారులు ప్రవేశించారని కామెంట్స్..
- నేపాల్ ఆందోళనల్లో కుట్ర ఉందని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి శుక్రవారం దేశ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. నేపాల్ సార్వభౌమాధికారంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. ఇటీవల, దేశంలో అవినీతికి వ్యతిరేకంగా జెన్-జీ యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనలు హింసకు దారి తీశాయి. భద్రతా బలగాలు జరిపిన దాడుల్లో 51 మంది మరణించారు. అయితే, తాను కాల్పులకు ఆదేశాలు ఇవ్వలేదని, ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిగాయని, దేశ పోలీసుల వద్ద అలాంటి ఆయుధాలు లేవని చెప్పారు. ఇదంతా చూస్తుంటే, దీని వెనక ‘‘కుట్ర’’ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు.
Read Also: Kiran Abbavaram: మా అన్న రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు.. మీ ప్రాణాల కోసం రూల్స్ పాటించండి
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
ఫేస్ బుక్ పోస్టులో.. ‘‘ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం. 70 సంవత్సరాలు పోరాడిన తర్వాత నేపాల్ ప్రజలు ఎన్నుకున్న రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య గణతంత్రం, సమాఖ్య సమగ్ర వ్యవస్థ, ప్రజల హక్కులు స్థాపించబడిన రోజు.’’ అని ఓలి రాశారు. గత వారం శాంతియుతంగా జరగాల్సిన జెన్-జీ నిరసనల్లో చొరబాటు జరిగిందని, చొరబడిన కుట్రదారులు హింసను సృష్టించారని, మన యువతను చంపారని, పోలీసుల వద్ద లేని ఆటోమెటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపిన సంఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
మరణించిన యువతకు సంతాపం తెలియజేసిన ఓలి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. అల్లర్ల సమయంలో మన రాజ్యాంగపై అతిపెద్ద దాడి జరిగిందని, సింఘా దర్బార్ తగలబడిందని, దేశ చిహ్నాన్ని చెరిపేయడానికి ప్రయత్నించారని, కోర్టులు, వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, నాయకుల ఇళ్లు, వ్యక్తిగత ఆస్తి బూడిదగా మారిందని చెప్పారు. నేపాల్ మొత్తం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!