Kim Jong Un: క్షిపణి ప్రయోగాల వెనుక.. అసలు కారణం చెప్పిన కిమ్
Kim Jong Un Reveals His Goal Over Nuclear Tests: ఉత్తర కొరియా ఎప్పుడూ లేనంతగా ఈమధ్య కాలంలో వరుస క్షిపణి ప్రయోగాలు చేస్తోన్న విషయం తెలిసిందే! కొన్ని రోజుల కిందటే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని సైతం చేపట్టింది. ఇలా వరుస క్షపణి ప్రయోగాలతో హడలెత్తిస్తున్న ఈ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా దాని వెనుక గల కారణాల్ని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉండటమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. ఉత్తర కొరియా అతిపెద్ద బాలిస్టిక్ క్షిపణి పరీక్షలో భాగమైన సైనిక అధికారులను అభినందించిన ఈయన.. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తమ దేశంతో పాటు పౌరుల గౌరవం, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకే అణుశక్తిని నిర్మిస్తున్నామని కిమ్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన అణ్వాయుధ శక్తిగా నిలవడమే తమ దేశ లక్ష్యమని వెల్లడించారు. హ్వాసాంగ్-17 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధంగా అభివర్ణించిన ఆయన.. ఇది పటిష్ఠమైన సైన్యాన్ని నిర్మించగల ఉత్తర కొరియా సంకల్పం, సామర్థ్యాన్ని చాటుతుందని తెలిపారు. బాలిస్టిక్ క్షిపణులపై అణు వార్హెడ్లను అమర్చే సాంకేతికత అభివృద్ధిలో తమ దేశ శాస్త్రవేత్తలు అద్భుతమైన ముందడుగు వేశారని కొనియాడారు. కాగా.. ఉత్తర కొరియా ఈ ఒక్క సంవత్సరంలో మాత్రమే ఇప్పటివరకు ఎనిమిది ఖండాంతర క్షిపణులను పరీక్షించడం గమనార్హం.
Also Read
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
ఇదిలావుండగా.. ఇటీవల ఉత్తర కొరియా ఖండాతర క్షిపణిని ప్రయోగించిన 24 గంటల్లోపే అమెరికా, కొరియా ద్వీపకల్పం లక్ష్యంగా వ్యూహాత్మక బాంబర్లను మరోసారి మోహరించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే కొరియా ద్వీపకల్పంపై అమెరికా వాయుసేనకు చెందిన బీ-1బీ వ్యూహాత్మక బాంబర్లను మళ్లీ మోహరించామని దక్షిణ కొరియా ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు అత్యాధునిక ఎఫ్-35 యుద్ధ విమానాలు కూడా తమ సైనికవిన్యాసాల్లో పాలుపంచుకుంటున్నట్లు ఆ దేశం పేర్కొంది.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!