Water Emergency: పాక్కు నీటి కష్టాలు.. భారత్ దెబ్బకి ఎండిపోతున్న పంటలు
- పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్..
- సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడంతో పాక్ లో మొదలైన నీటి కష్టాలు..
- సింధూ జలాలు రాకపోవడంతో పాక్ లోని పంటలు ప్రమాదంలో పడే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs Pak Water Emergency: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పేందుకు సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడంతో దాయాది దేశానికి నీటి కష్టాలు మొదలయ్యాయి. జలాశయాల్లో నీటిమట్టం పడిపోవడంతో.. సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15 శాతం మేర తగ్గిపోయింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు ఖరీఫ్లో మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. పంజాబ్ ప్రావిన్సులో ప్రస్తుతం నీటి విడుదల 1.24 లక్షల క్యూసెక్కులకు తగ్గిపోగా.. తాజా గణాంకాల ప్రకారం పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని టార్బెలా ఆనకట్ట దగ్గర సింధూ నది నీటి మట్టం 1,465 మీటర్లకు పడిపోయింది.. కనిష్ఠ స్థాయి నీటిమట్టం 1,402 మీటర్లు ఉంది.
Read Also: Israel: హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ మృతదేహం స్వాధీనం చేసుకున్న ఐడీఎఫ్
Also Read
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
అయితే, పంజాబ్లోని చస్మా ఆనకట్ట వద్ద ప్రస్తుత నీటిమట్టం 644 మీటర్లుగా ఉందని పాక్ అధకారులు తెలిపారు. ఇక్కడ డెడ్ స్టోరేజీ స్థాయి 638 మీటర్లకు చేరినట్లు తెలుస్తుంది. ఇక, సియాల్కోట్లో మరాలా దగ్గర పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది.. చీనాబ్పై సగటు నీటి విడుదల మే 28వ తేదీ నాటికి 26,645 వేల క్యూసెక్కులు ఉంటే జూన్ 5వ తేదీ నాటికి 3,064 క్యూసెక్కులకు పడిపోయింది. ఈ నీటి ఎద్దడితో పాక్లోని పంజాబ్లో ఖరీఫ్ పంటలు ఇప్పుడు కష్టాల్లో పడ్డాయి. భారత్ నిర్ణయంతో 21 శాతం నీటి కొరత ఏర్పడుతుందని ఇప్పటికే పాక్ అంచనా వేసింది. టెర్రరిజంపై పాక్ తీరు మారే వరకూ ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
-
Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
-
Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో ‘లగ్జరీ’ ఫోన్.. రేపు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!