Water Emergency: పాక్కు నీటి కష్టాలు.. భారత్ దెబ్బకి ఎండిపోతున్న పంటలు
- పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్..
- సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడంతో పాక్ లో మొదలైన నీటి కష్టాలు..
- సింధూ జలాలు రాకపోవడంతో పాక్ లోని పంటలు ప్రమాదంలో పడే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs Pak Water Emergency: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పేందుకు సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడంతో దాయాది దేశానికి నీటి కష్టాలు మొదలయ్యాయి. జలాశయాల్లో నీటిమట్టం పడిపోవడంతో.. సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15 శాతం మేర తగ్గిపోయింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు ఖరీఫ్లో మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. పంజాబ్ ప్రావిన్సులో ప్రస్తుతం నీటి విడుదల 1.24 లక్షల క్యూసెక్కులకు తగ్గిపోగా.. తాజా గణాంకాల ప్రకారం పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని టార్బెలా ఆనకట్ట దగ్గర సింధూ నది నీటి మట్టం 1,465 మీటర్లకు పడిపోయింది.. కనిష్ఠ స్థాయి నీటిమట్టం 1,402 మీటర్లు ఉంది.
Read Also: Israel: హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ మృతదేహం స్వాధీనం చేసుకున్న ఐడీఎఫ్
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
అయితే, పంజాబ్లోని చస్మా ఆనకట్ట వద్ద ప్రస్తుత నీటిమట్టం 644 మీటర్లుగా ఉందని పాక్ అధకారులు తెలిపారు. ఇక్కడ డెడ్ స్టోరేజీ స్థాయి 638 మీటర్లకు చేరినట్లు తెలుస్తుంది. ఇక, సియాల్కోట్లో మరాలా దగ్గర పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది.. చీనాబ్పై సగటు నీటి విడుదల మే 28వ తేదీ నాటికి 26,645 వేల క్యూసెక్కులు ఉంటే జూన్ 5వ తేదీ నాటికి 3,064 క్యూసెక్కులకు పడిపోయింది. ఈ నీటి ఎద్దడితో పాక్లోని పంజాబ్లో ఖరీఫ్ పంటలు ఇప్పుడు కష్టాల్లో పడ్డాయి. భారత్ నిర్ణయంతో 21 శాతం నీటి కొరత ఏర్పడుతుందని ఇప్పటికే పాక్ అంచనా వేసింది. టెర్రరిజంపై పాక్ తీరు మారే వరకూ ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!