JD Vance-Netanyahu: జేడీ వాన్స్-నెతన్యాహు మధ్య తీవ్ర ఘర్షణ.. ఏం జరిగిందంటే..!
- జేడీ వాన్స్-నెతన్యాహు మధ్య తీవ్ర ఘర్షణ
- ఫోన్ సంభాషణలో ఇద్దరి మధ్య వాగ్యుద్ధం
- అంతర్జాతీయ మీడియాలో కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగినట్లుగా అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. ఇరాన్పై దాడులు చేయాలన్న అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ చాలా హాట్ హాట్గా సాగినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్పై యుద్ధం విషయంలో రెండు దేశాల మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లినట్లుగా ఆక్సియోస్ తన నివేదికలో పేర్కొంది.
సోమవారం నెతన్యాహు-జేడీ వాన్స్ల మధ్య జరిగిన తీవ్ర సంభాషణ తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వంలోని కొందరు జేడీ వాన్స్ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైట్ హౌస్ అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
- Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
- Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
- Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
ఇజ్రాయెల్-అమెరికన్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఇరాన్తో యుద్ధం గురించి నెతన్యాహు చేసిన అనేక అంచనాలు.. ముఖ్యంగా ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజలు తిరుగుబాటు చేసే విషయంలో మితిమీరిన ఆశావాదంతో కూడుకున్నవని పేర్కొన్నట్లు తెలుస్తోంది. యుద్ధానికి ముందు పాలన మార్పు జరిగే అవకాశం వాస్తవం కంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పి నెతన్యాహు.. అధ్యక్షుడు ట్రంప్ను ప్రలోభపెట్టారని.. ఇప్పుడు ఆ వ్యాఖ్యల గురించి నెతన్యాహును జేడీ వాన్స్ ప్రశ్నిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Yogi Adityanath: సీఎం యోగికి ఐదేళ్ల బాలిక గిఫ్ట్.. ఏమిచ్చిందంటే..!
ఇదిలా ఉండగా ఇరాన్ గడ్డపై అమెరికా దళాలు భూతల దాడులకు దిగడంపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాంతంలోని తమ స్థావరాల్లో సొంత సైనికులను కాపాడలేక.. వారిని హోటళ్లు, పార్కుల్లో దాచిపెడుతున్న అమెరికా.. ఇరాన్ గడ్డపై వారిని ఎలా కాపాడగలదు?.’’ అని ప్రశ్నించారు.
రష్యా హెచ్చరిక
ఇరాన్లో అమెరికా జరిపే భూతల సైనిక చర్య వియత్నాం యుద్ధం వంటి పరిణామాలనే కలిగిస్తుందని.. దాని నుంచి అమెరికా గౌరవప్రదంగా బయటపడలేదని రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు మెద్వెదేవ్ హెచ్చరించారు. అటువంటి పరిణామాలు ఈ ప్రాంతానికి వినాశకరంగా ఉంటాయని తెలిపారు. గతంలో ఇరాన్ కూడా అమెరికాకు వియత్నాం యుద్ధాన్ని గుర్తు చేసిందని.. వియత్నాం యుద్ధంలో అమెరికా ఘోర పరాజయాన్ని చవిచూసిందని.. అమెరికా ప్రజలు దాని గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడరని గమనించాలని రష్యా సూచించింది.
ఇది కూడా చదవండి: PM Modi: అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ కాన్ఫరెన్స్.. పశ్చిమాసియా పరిణామాలపై చర్చ
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..