JD Vance-Netanyahu: జేడీ వాన్స్-నెతన్యాహు మధ్య తీవ్ర ఘర్షణ.. ఏం జరిగిందంటే..!
- జేడీ వాన్స్-నెతన్యాహు మధ్య తీవ్ర ఘర్షణ
- ఫోన్ సంభాషణలో ఇద్దరి మధ్య వాగ్యుద్ధం
- అంతర్జాతీయ మీడియాలో కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగినట్లుగా అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. ఇరాన్పై దాడులు చేయాలన్న అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ చాలా హాట్ హాట్గా సాగినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్పై యుద్ధం విషయంలో రెండు దేశాల మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లినట్లుగా ఆక్సియోస్ తన నివేదికలో పేర్కొంది.
సోమవారం నెతన్యాహు-జేడీ వాన్స్ల మధ్య జరిగిన తీవ్ర సంభాషణ తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వంలోని కొందరు జేడీ వాన్స్ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైట్ హౌస్ అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read
- ఇరాన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో ప్రపంచం మొత్తం మారిపోయింది..హార్మూజ్ తెరుచుకున్నా సీన్ మారదా?
- Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
- Benjamin Netanyahu: అమెరికా ఒప్పందం చేసుకున్నా తగ్గేదేలే.. ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్..
- US-Iran శాంతి ఒప్పందం.! పెట్రోల్ నుంచి హోం లోన్ వరకు.. భారతీయులకు ఎలాంటి ప్రభావం పడనుందంటే.!
ఇజ్రాయెల్-అమెరికన్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఇరాన్తో యుద్ధం గురించి నెతన్యాహు చేసిన అనేక అంచనాలు.. ముఖ్యంగా ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజలు తిరుగుబాటు చేసే విషయంలో మితిమీరిన ఆశావాదంతో కూడుకున్నవని పేర్కొన్నట్లు తెలుస్తోంది. యుద్ధానికి ముందు పాలన మార్పు జరిగే అవకాశం వాస్తవం కంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పి నెతన్యాహు.. అధ్యక్షుడు ట్రంప్ను ప్రలోభపెట్టారని.. ఇప్పుడు ఆ వ్యాఖ్యల గురించి నెతన్యాహును జేడీ వాన్స్ ప్రశ్నిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Yogi Adityanath: సీఎం యోగికి ఐదేళ్ల బాలిక గిఫ్ట్.. ఏమిచ్చిందంటే..!
ఇదిలా ఉండగా ఇరాన్ గడ్డపై అమెరికా దళాలు భూతల దాడులకు దిగడంపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాంతంలోని తమ స్థావరాల్లో సొంత సైనికులను కాపాడలేక.. వారిని హోటళ్లు, పార్కుల్లో దాచిపెడుతున్న అమెరికా.. ఇరాన్ గడ్డపై వారిని ఎలా కాపాడగలదు?.’’ అని ప్రశ్నించారు.
రష్యా హెచ్చరిక
ఇరాన్లో అమెరికా జరిపే భూతల సైనిక చర్య వియత్నాం యుద్ధం వంటి పరిణామాలనే కలిగిస్తుందని.. దాని నుంచి అమెరికా గౌరవప్రదంగా బయటపడలేదని రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు మెద్వెదేవ్ హెచ్చరించారు. అటువంటి పరిణామాలు ఈ ప్రాంతానికి వినాశకరంగా ఉంటాయని తెలిపారు. గతంలో ఇరాన్ కూడా అమెరికాకు వియత్నాం యుద్ధాన్ని గుర్తు చేసిందని.. వియత్నాం యుద్ధంలో అమెరికా ఘోర పరాజయాన్ని చవిచూసిందని.. అమెరికా ప్రజలు దాని గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడరని గమనించాలని రష్యా సూచించింది.
ఇది కూడా చదవండి: PM Modi: అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ కాన్ఫరెన్స్.. పశ్చిమాసియా పరిణామాలపై చర్చ
తాజావార్తలు
-
Nagpur: ఐఏఎఫ్ అధికారి భార్యపై అత్యాచారం, మతం మార్చుకోవాలని ఒత్తిడి.. సంచలనంగా నాగ్పూర్ వైరల్ వీడియో..
-
Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
-
Uttar Pradesh: ఓవైసీతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ..? యూపీలో కొత్త కూటమి..
-
Kerala: నిపా నుంచి షిగెల్లా వరకు..కొత్త వ్యాధుల అడ్డాగా కేరళ ఎందుకు నిలుస్తోంది?
-
Actor Vishal : బొకేలు, శాలువాలు పక్కనబెట్టి కాలేజీ స్నేహితుల కలయిక
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?