Viral: యువత తగ్గిపోతుండటంతో.. ఇండియా వైపు కన్నేసిన జపాన్..
- వృద్ధులు పెరిగిపోతుండడం, పనిచేసే యువత తగ్గిపోతుండటంతో..
- ఇండియా వైపు చూస్తోన్న జపాన్
- 30 శాతం మందికిపైగా ఉన్న 65 ఏళ్ల వయస్సు వారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తతం జపాన్ లో జపాన్ దేశంలో వృద్ధులు పెరిగిపోతుండడం, పనిచేసే యువత తగ్గిపోతుండటంతో.. ఆ దేశం ఇండియా వైపు చూస్తోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు మన దేశంలోని అత్యంత నైపుణ్యమున్న ప్రతిభావంతుల కోసం మొగ్గు చూపుతున్నది. ప్రస్తుతం ఆ దేశంలో 30 శాతం మందికిపైగా 65 ఏండ్లకు పైబడిన వారే ఉన్నారు. దీంతో ఆ దేశ వర్క్ ఫోర్స్ భారీగా పడిపోతున్నది.
2040 నాటికి ఆ దేశంలో పనిచేసే వారి సంఖ్య కోటి మందికిపైగా పడిపోతుందని పలు సంస్థలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. దీంతో ఆ దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఆందోళన మొదలైంది. ఇటు 2030 నాటికి దాదాపు 6 లక్షల మంది ఐటీ ఉద్యోగుల కొరత కూడా ఏర్పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా కాకుండా అమెరికా, చైనా వంటి దేశాల్లో జీసీసీలను ఏర్పాటు చేయడంతో.. కంపెనీలకు ధరా భారంగానూ మారుతున్నట్టు చెప్తున్నారు.
Also Read
- Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
- Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
- Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
- UK: లండన్లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
ఈ క్రమంలో కాస్ట్ ను తగ్గించుకునేందుకు, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిభ కలిగిన మానవ వనరులు మన దగ్గర ఎక్కువగా ఉండడంతో.. ఇండియా వైపు చూస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,800 జీసీసీలుండగా.. అందులో జపాన్ కు చెందిన సంస్థలే 85 ఉన్నాయి. దాదాపు 5 శాతం జీసీసీలు ఆ దేశానికి చెందినవే. ఆయా సంస్థల్లో ప్రస్తుతం 1.85 లక్షల మంది పనిచేస్తున్నారు.
అయితే, 2028 నాటికి జపాన్కు చెందిన జీసీసీలు రెట్టింపవుతాయని, 150 వరకు జీసీసీల ఏర్పాటుకు అవకాశముందని అంటున్నారు. వాటి ద్వారా 3.5 లక్షల మందికి ఉపాధి దొరకుతుందని, ఏటా రూ.22 వేల కోట్లకుపైగా (250 కోట్ల డాలర్లు) పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇటీవలే జపాన్కు చెందిన ప్రముఖ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ దాయిచి లైఫ్ హైదరాబాద్లో జీసీసీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాబోయే కాలంలో జీసీసీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2026 చివరి నాటికి మరో 12 దాకా ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
-
PM Modi: దేశ యువత ఇచ్చిన సూచనలకు కృతజ్ఞతలు.. అర్ధరాత్రి మరోసారి స్పందించిన ప్రధాని మోడీ
-
Balakrishna Health Update: శస్త్రచికిత్స సక్సెస్.. బాలయ్య హెల్త్పై బ్రాహ్మణి గుడ్న్యూస్!
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!