S Jaishankar: ప్రణాళిక ప్రకారమే పహల్గామ్ దాడి జరిగింది.. చైనా టూర్లో జైశంకర్ ప్రస్తావన
- ప్రణాళిక ప్రకారమే పహల్గామ్ దాడి జరిగింది
- చైనా టూర్లో జైశంకర్ ప్రస్తావన
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం జైశంకర్ సోమవారం చైనాకు వెళ్లారు. జూన్ 2020లో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. మళ్లీ ఇన్నాళ్లకు సర్దుకున్నాయి. ఇక పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో ఎస్ జైశంకర్ సమావేశం అయ్యారు. ఇక చైనాతో ఘర్షణ తర్వాత జైశంకర్ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోరం.. ప్రేమికుడి కోసం కన్నకూతుర్ని చంపేసిన ఇల్లాలు
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
ఇదిలా ఉంటే షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడి అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా మూడు చెడు ఉద్దేశాలను గుర్తుచేశారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం ఈ మూడు తరుచుగా కలిసి జరుగుతాయన్నారు. ఏప్రిల్ 22న భారత్లో పహల్గామ్ ఉగ్ర దాడిని ప్రపంచమంతా చూసిందని గుర్తుచేశారు. జమ్మూకాశ్మీర్లో పర్యాటక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని, మత విభజన కోసం ఉద్దేశపూర్వకంగా ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. యూఎన్ భద్రతా మండలి ఈ దాడిని తీవ్రంగా ఖండించిందని పేర్కొన్నారు. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిపారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారని.. దీనికి ప్రతీకారంగా లష్కరే తోయిబా (LeT), జైషే మొహమ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్ (HM) వంటి ఇతర ఉగ్రవాద సంస్థలను నాశనం చేయడానికి భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి, రష్యన్ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్లను కూడా ఉన్నారు.
ఇది కూడా చదవండి: King Charles: బ్రిటన్ రాజు చార్లెస్ను కలిసిన టీమిండియా..!
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో