S Jaishankar: ప్రణాళిక ప్రకారమే పహల్గామ్ దాడి జరిగింది.. చైనా టూర్లో జైశంకర్ ప్రస్తావన
- ప్రణాళిక ప్రకారమే పహల్గామ్ దాడి జరిగింది
- చైనా టూర్లో జైశంకర్ ప్రస్తావన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం జైశంకర్ సోమవారం చైనాకు వెళ్లారు. జూన్ 2020లో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. మళ్లీ ఇన్నాళ్లకు సర్దుకున్నాయి. ఇక పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో ఎస్ జైశంకర్ సమావేశం అయ్యారు. ఇక చైనాతో ఘర్షణ తర్వాత జైశంకర్ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోరం.. ప్రేమికుడి కోసం కన్నకూతుర్ని చంపేసిన ఇల్లాలు
Also Read
- Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
ఇదిలా ఉంటే షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడి అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా మూడు చెడు ఉద్దేశాలను గుర్తుచేశారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం ఈ మూడు తరుచుగా కలిసి జరుగుతాయన్నారు. ఏప్రిల్ 22న భారత్లో పహల్గామ్ ఉగ్ర దాడిని ప్రపంచమంతా చూసిందని గుర్తుచేశారు. జమ్మూకాశ్మీర్లో పర్యాటక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని, మత విభజన కోసం ఉద్దేశపూర్వకంగా ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. యూఎన్ భద్రతా మండలి ఈ దాడిని తీవ్రంగా ఖండించిందని పేర్కొన్నారు. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిపారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారని.. దీనికి ప్రతీకారంగా లష్కరే తోయిబా (LeT), జైషే మొహమ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్ (HM) వంటి ఇతర ఉగ్రవాద సంస్థలను నాశనం చేయడానికి భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి, రష్యన్ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్లను కూడా ఉన్నారు.
ఇది కూడా చదవండి: King Charles: బ్రిటన్ రాజు చార్లెస్ను కలిసిన టీమిండియా..!
తాజావార్తలు
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
-
Mohammad Rizwan – Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ – బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!