King Charles: బ్రిటన్ రాజు చార్లెస్ను కలిసిన టీమిండియా..!
- బ్రిటన్ రాజు చార్లెస్ను కలిసిన టీమిండియా పురుషులు, మహిళా క్రికెట్ జట్లు.
- మూడో టెస్ట్ గురించి మాట్లాడిన రాజు చార్లెస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King Charles: లార్డ్స్లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో 22 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత టీమిండియా పురుషులు, మహిళా క్రికెట్ జట్లు బ్రిటన్ రాజు చార్లెస్ ను లండన్ లోని క్లారెన్స్ హౌస్ లో మంగళవారం (జూలై 15) కలిశాయి. ఈ సందర్బంగా.. రాజు చార్లెస్ భారత జట్లతో మమేకమై, లార్డ్స్ లో జరిగిన ఇంగ్లాండ్, భారత్ మూడో టెస్టు మ్యాచ్కు సంబంధించిన హైలైట్లను తాను చూశానని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఐదో రోజు తొందరగా ఎనిమిది వికెట్లు కోల్పోయినప్పటికీ చివరికి కేవలం 22 పరుగుల తేడాతో ఓడిపోయిందని అన్నారు. అలాగే చివరి వికెట్గా మహ్మద్ సిరాజ్, షోయబ్ బషీర్ బౌలింగ్లో బంతి స్టంప్స్కి తగిలి అవుటయ్యాడని బ్రిటన్ రాజు చార్లెస్ ప్రత్యేకంగా గుర్తు చేశారు.
Read Also:HMD T21 Tablet: వాయిస్ కాలింగ్, 8200mAh బ్యాటరీతో HMD T21 విడుదల..!
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
#WATCH | London, UK | On the lord's #INDvsENGTest | Team India skipper Shubman Gill says, "The way both the teams played, they showed a lot of passion. We played with a lot of pride and gave our all mentally and physically. At the end of the day, when you play a test match that… pic.twitter.com/M3ySIQOTLS
— ANI (@ANI) July 15, 2025
ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. బ్రిటన్ రాజు చార్లెస్ను కలవడం ఒక అద్భుతమైన అనుభవం అని అన్నారు. ఆయన ఎంతో సౌమ్యంగా, ఆత్మీయంగా మాతో మాట్లాడారని.. లార్డ్స్ టెస్టు గురించి ప్రత్యేకంగా అడిగారని చెప్పుకొచ్చారు. చివరి ఆటగాడు (సిరాజ్) అవుట్ అయిన తీరును గురించి ఆయన పేర్కొన్నారని తెలిపాడు. అది నిజంగా దురదృష్టకరం. ఆ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ వాళ్లైనా గెలిచే అవకావం ఉండేది. కానీ, తక్కువ తేడాతో ఓడిపోయాం అని అంటూనే.. తర్వాతి రెండు మ్యాచ్లలో గెలవాలనే ధీమాతో ఉన్నాం అని గిల్ తెలిపారు. ఈ సమావేశం భారత్, ఇంగ్లాండ్ క్రికెట్ మధ్య కొనసాగుతున్న సిరీస్ కు ఒక మర్యాదాపూర్వక విరామంలా మారింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న మహిళల జట్టు సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
Read Also:Zee Telugu: స్క్రీన్ రైటర్ల కోసం ‘జీ’ రైటర్స్ రూమ్!
#WATCH | The United Kingdom: King Charles III pose with the players of the Indian Men's and Women's Cricket team, the coach, staff members and BCCI officials, at St. James's Palace in London. pic.twitter.com/YRhQPcXvuw
— ANI (@ANI) July 15, 2025
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!