Anti Hijab Protest: ఇరాన్ విద్యార్థులపై విషప్రయోగం.. 1200 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iranian students ‘intentionally’ poisoned before mass protest: ఇరాన్ వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది. 22 ఏళ్ల అమ్మాయి మహ్సా అమినిని హిజాబ్ ధరించలేదని ఆరోపిస్తూ అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లి మరణించింది. ఈ మరణం ఇరాన్ వ్యాప్తంగా ఆగ్రహానికి కారణం అయింది. పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు, విద్యార్థులు హిజాబ్ కు, మోరాటిటీ పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశారు. ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు 300 మందికి పైగా మరణించారు. అయితే అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని పలు హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Read Also: India vs Bangladesh: పోరాడి ఓడిన భారత్.. వన్డే సిరీస్ బంగ్లా కైవసం
Also Read
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
- Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
- Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
- El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
ఇదిలా ఉంటే ఇరాన్ లోని జాతీయ విద్యార్థి సంఘం సుమారు 1200 మంది యూనివర్సిటీ విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యారని పేర్కొంది. ఖరాజమీ, ఆర్క్ విశ్వవిద్యాలయాలు సహా మరో నాలుగు యూనివర్సిటీలకు చెందిన 1200 మంది విద్యార్థులు నిన్న ఆహారం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, శరీర నొప్పులు, తీవ్రమైన తలనొప్పులతో బాధపడ్డారు. దీంతో అక్కడి యూనివర్సిటీ కెఫెటేరియాల్లో తినకూడదని విద్యార్థులు నిర్ణయించుకున్నారు.
అయితే అధికారులు మాత్రం నీటిలో బ్యాక్టీరియా వంటి వాటి వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెబుతుంటే.. ది నేషనల్ స్టూడెంట్ యూనియన్ మాత్రం తినే ఆహారంలో విషం కలిపినట్లు ఆరోపిస్తోంది. రెండు నెలల క్రితం మహ్సా అమిని మరణంతో మొదలైన ఈ హిజాబ్ వ్యతిరేక ఉద్యమం, సుప్రీం లీడర్ గద్డె దిగాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. మహిళలు హిజాబ్ విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుంటూ నిరసనలు తెలిపారు. అయితే ఆందోనళతో దిగి వచ్చిన అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం మోరాలిటీ పోలీసింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఇరాన్ ప్రాసిక్యుటర్ జనరల్ మోహమ్మద్ జాఫర్ మోంటాజెరి ఈ విషయాన్ని ప్రకటించారు.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!