Anti Hijab Protest: ఇరాన్ విద్యార్థులపై విషప్రయోగం.. 1200 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iranian students ‘intentionally’ poisoned before mass protest: ఇరాన్ వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది. 22 ఏళ్ల అమ్మాయి మహ్సా అమినిని హిజాబ్ ధరించలేదని ఆరోపిస్తూ అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లి మరణించింది. ఈ మరణం ఇరాన్ వ్యాప్తంగా ఆగ్రహానికి కారణం అయింది. పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు, విద్యార్థులు హిజాబ్ కు, మోరాటిటీ పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశారు. ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు 300 మందికి పైగా మరణించారు. అయితే అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని పలు హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Read Also: India vs Bangladesh: పోరాడి ఓడిన భారత్.. వన్డే సిరీస్ బంగ్లా కైవసం
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
ఇదిలా ఉంటే ఇరాన్ లోని జాతీయ విద్యార్థి సంఘం సుమారు 1200 మంది యూనివర్సిటీ విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యారని పేర్కొంది. ఖరాజమీ, ఆర్క్ విశ్వవిద్యాలయాలు సహా మరో నాలుగు యూనివర్సిటీలకు చెందిన 1200 మంది విద్యార్థులు నిన్న ఆహారం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, శరీర నొప్పులు, తీవ్రమైన తలనొప్పులతో బాధపడ్డారు. దీంతో అక్కడి యూనివర్సిటీ కెఫెటేరియాల్లో తినకూడదని విద్యార్థులు నిర్ణయించుకున్నారు.
అయితే అధికారులు మాత్రం నీటిలో బ్యాక్టీరియా వంటి వాటి వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెబుతుంటే.. ది నేషనల్ స్టూడెంట్ యూనియన్ మాత్రం తినే ఆహారంలో విషం కలిపినట్లు ఆరోపిస్తోంది. రెండు నెలల క్రితం మహ్సా అమిని మరణంతో మొదలైన ఈ హిజాబ్ వ్యతిరేక ఉద్యమం, సుప్రీం లీడర్ గద్డె దిగాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. మహిళలు హిజాబ్ విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుంటూ నిరసనలు తెలిపారు. అయితే ఆందోనళతో దిగి వచ్చిన అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం మోరాలిటీ పోలీసింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఇరాన్ ప్రాసిక్యుటర్ జనరల్ మోహమ్మద్ జాఫర్ మోంటాజెరి ఈ విషయాన్ని ప్రకటించారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?