Anti Hijab Protest: ఇరాన్ విద్యార్థులపై విషప్రయోగం.. 1200 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iranian students ‘intentionally’ poisoned before mass protest: ఇరాన్ వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది. 22 ఏళ్ల అమ్మాయి మహ్సా అమినిని హిజాబ్ ధరించలేదని ఆరోపిస్తూ అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లి మరణించింది. ఈ మరణం ఇరాన్ వ్యాప్తంగా ఆగ్రహానికి కారణం అయింది. పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు, విద్యార్థులు హిజాబ్ కు, మోరాటిటీ పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశారు. ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు 300 మందికి పైగా మరణించారు. అయితే అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని పలు హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Read Also: India vs Bangladesh: పోరాడి ఓడిన భారత్.. వన్డే సిరీస్ బంగ్లా కైవసం
Also Read
- Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ 'అణు' బాంబ్.. 'సర్మాట్' క్షిపణితో సర్ప్రైజ్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. 'మాపై చేయి వేస్తే.. అణు విలయమే!'
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
ఇదిలా ఉంటే ఇరాన్ లోని జాతీయ విద్యార్థి సంఘం సుమారు 1200 మంది యూనివర్సిటీ విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యారని పేర్కొంది. ఖరాజమీ, ఆర్క్ విశ్వవిద్యాలయాలు సహా మరో నాలుగు యూనివర్సిటీలకు చెందిన 1200 మంది విద్యార్థులు నిన్న ఆహారం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, శరీర నొప్పులు, తీవ్రమైన తలనొప్పులతో బాధపడ్డారు. దీంతో అక్కడి యూనివర్సిటీ కెఫెటేరియాల్లో తినకూడదని విద్యార్థులు నిర్ణయించుకున్నారు.
అయితే అధికారులు మాత్రం నీటిలో బ్యాక్టీరియా వంటి వాటి వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెబుతుంటే.. ది నేషనల్ స్టూడెంట్ యూనియన్ మాత్రం తినే ఆహారంలో విషం కలిపినట్లు ఆరోపిస్తోంది. రెండు నెలల క్రితం మహ్సా అమిని మరణంతో మొదలైన ఈ హిజాబ్ వ్యతిరేక ఉద్యమం, సుప్రీం లీడర్ గద్డె దిగాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. మహిళలు హిజాబ్ విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుంటూ నిరసనలు తెలిపారు. అయితే ఆందోనళతో దిగి వచ్చిన అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం మోరాలిటీ పోలీసింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఇరాన్ ప్రాసిక్యుటర్ జనరల్ మోహమ్మద్ జాఫర్ మోంటాజెరి ఈ విషయాన్ని ప్రకటించారు.
తాజావార్తలు
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
-
GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
-
Avatar 3: ఫైనల్గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!