Israel Iran Conflict: ఇజ్రాయిల్ దాడుల్లో మరణించిన కీలక నేతలకు ప్రభుత్వ లాంఛనాలతో ఇరాన్ అంత్యక్రియలు..
- ఇజ్రాయిల్ దాడుల్లో మరణించిన ఇరాన్ కమాండర్లు, అణు శాస్త్రవేత్తలు..
- ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Iran Conflict: ఇటీవల ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇరాన్ అణు కార్యక్రమాలపై వైమానిక దాడులు నిర్వహించింది. అణు ఫెసిలిటీలపై దాడులతో పాటు అణు శాస్త్రవేత్తలను, సైనిక కమాండర్లను హతమార్చింది. దాదాపుగా అత్యున్నత స్థాయిలో ఉన్న 60 మందిని టార్గెటెడ్ దాడుల్లో చంపేసింది. అయితే, శనివారం ఇరాన్ ప్రభుత్వ లాంఛనాలతో వీరికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ సందర్భంగా దేశ రాజధాని టెహ్రాన్లో వ్యాపారాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసేసి పెద్ద సంఖ్యలో ప్రజలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇరాన్ అధ్యక్షుడ మసౌద్ పెజెష్కియాన్తో పాటు ఇతర సీనియర్ ప్రభుత్వాధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.
Also Read
టెహ్రాన్లో అమరవీరుల గౌరవార్థం కార్యక్రమం నిర్వహించిన తర్వాత 11 కి.మీ దూరంలోని ఆజాది స్వ్కేర్ వరకు అంత్యక్రియల ఊరేగింపు జరిగింది. టెహ్రాన్ ఇస్లామిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అధిపతి మొహ్సేన్ మహమూది మాట్లాడుతూ.. ఇది ఇస్లామిక్ ఇరాన్, విప్లవానికి చారిత్రాత్మక రోజు అని చెప్పారు. మృతుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మేజర్ జనరల్, ఇరాన్ సైన్యానికి రెండో కమాండర్గా ఉన్న మొహమ్మద్ బాఘేరీ ఉన్నారు. బాఘేరితో పాటు ఆయన భార్య, కుమార్తెలను ఆయనతో పాటే ఖననం చేస్తారు.
ఇజ్రాయిల్ దాడుల్లో మరణించిన అణు శాస్త్రవేత్త మొహమ్మద్ మెహదీ టెహ్రాన్చిని కూడా అతడి భార్యతో పాటు ఖననం చేయనున్నారు. ఘర్షణ మొదటి రోజు మరణించిన రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ హుస్సేన్ సలామీని కూడా శనివారం వేడగల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. మొత్తం 30 మంది ఇతర అగ్ర కమాండర్లను కూడా ఇరాన్ ప్రభుత్వం గౌరవార్థం కార్యక్రమం నిర్వహిస్తుంది.
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!