NTV Telugu Site icon

ఐఎస్ఎస్ కు తృటిలో త‌ప్పిన పెనుప్ర‌మాదం… ఏం జ‌రిగిందంటే…

అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు పెను ప్ర‌మాదం తప్పింది. ర‌ష్యాకు చెందిన వ్యోమ‌నౌక రీసెర్చ్ మాడ్యూల్ అంత‌రిక్ష కేంద్రానికి చేరుకున్నాక ఐఎస్ఎస్ తో డాక్ చేశారు.  డాక్ చేసిన కొన్ని నిమిషాల త‌రువాత హ‌తాత్తుగా మాడ్యూల్‌కి చెందిన థ్ర‌స్ట‌ర్స్ ఫైర్ అయ్యాయి.  దీంతో అంత‌రిక్ష కేంద్రం కొంతమేర అదుపుత‌ప్పింది.  వెంట‌నే రంగంలోకి దిగిన నాసా శాస్త్ర‌వేత్త‌లు లోపాన్ని స‌వ‌రించారు.  దీంతో అంత‌రిక్ష కేంద్రం తిరిగి య‌ధాస్థితికి వ‌చ్చింది.  డాక్ చేసిన త‌రువాత కంప్యూర్స్‌లో అప్‌డేట్ కాక‌పోవ‌డంతో థ్ర‌స్ట‌ర్స్ ఫైర్ అయిన‌ట్టు లోపాన్ని వెంట‌నే స‌వ‌రించిన‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు. అంత‌రిక్ష కేంద్రంలో ఉన్న శాస్త్ర‌వేత్త‌లు, ఆస్ట్రోనాట్స్ అంతా క్షేమంగా ఉన్న‌ట్టు నాసా ప్ర‌క‌టించింది.  

Read: