NTV Telugu Site icon

Oman: ఒమన్‌లో కాల్పులు.. ఒక భారతీయుడు మృతి

Fire

Fire

ఒమన్ రాజధాని మస్కట్‌లోని షియా మసీదు సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక భారతీయుడు మరణించగా.. మరొకరు గాయపడ్డారని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. మృతుడి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ..కుటుంబాలకు అన్ని రకాల సహాయాన్ని అందజేస్తుందని ఎంబసీ తెలిపింది.

ఇది కూడా చదవండి: Amaravati: రాజధానిని నేషనల్ హైవేతో అనుసంధానించేలా సీఆర్డీయే ప్రణాళికలు

దాడి తర్వాత పరిస్థితిని చక్కదిద్దడానికి అవసరమైన అన్ని భద్రతా చర్యలు, విధానాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక సంఘటనాస్థలం నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు ఎక్స్ ద్వారా తెలిపారు. ఒమన్ జనాభా నాలుగు మిలియన్లకు పైగా ఉంది. వీరిలో 40 శాతం కంటే ఎక్కువ మంది ప్రవాస కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి.

ఇది కూడా చదవండి: Aman Preet: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సోదరుడు