Shubhanshu Shukla: నేడు రోదసిలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా
- నేడు రోదసిలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా
- 4 దశాబ్దాల తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న భారత వ్యోమగామి
- 14 రోజుల పాటు బృందం అంతరిక్షంలో పరిశోధనలు
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బుధవారం అంతరిక్షంలోకి వెళ్తున్నారు. రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డ్ సృష్టించబోతున్నాడు. 1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లాడు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఆ రికార్డ్ను 39 ఏళ్ల శుభాంశు శుక్లా తిరగ రాస్తున్నాడు. అమెరికా, పోలాండ్, హంగేరీకి చెందిన ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాంశు శుక్లా రోదసియాత్ర చేపట్టనున్నాడు. బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు యాక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుందని నాసా ప్రకటించింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్ర మండలానికి వెళ్లింది ఈ ప్రదేశం నుంచి కావడం విశేషం. 39 ఏళ్ల శుభాంశు శుక్లాను ఫైటర్ పైలట్గా ఇస్రో ప్రధాన వ్యోమగామిగా ఎంపిక చేసింది. నలుగురు సభ్యుల బృందం 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు.

Also Read
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
వాతావరణం, సాంకేతిక కారణాలతో ఆక్సియం-4 మిషన్ ప్రయోగం ఆరుసార్లు వాయిదా పడింది. ఇన్నాళ్లకు ఆక్సియం-4 మిషన్ ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి ఎగరనుంది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ను నిర్వహిస్తోంది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. 28 గంటల తర్వాత వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం 14 రోజుల పాటు అక్కడే ఉండి పరిశోధనలు చేస్తారు.
ఇది కూడా చదవండి: Coolie : ఆల్ టైమ్ రికార్డ్ ధరకు ‘కూలీ’ తెలుగు రైట్స్..
యాక్సియం-4 మిషన్ ప్రయోగం.. మొదట మే 29న ప్రయోగించాల్సి ఉండగా సాంకేతిక, వాతావరణ కారణాలతో జూన్ 8కి వాయిదా పడింది. తిరిగి జూన్ 10, జూన్ 11, జూన్ 12కి వాయిదా పడింది. స్పేష్ ఎక్స్ అంతరిక్ష నౌకలో లీక్ కారణంగా ప్రయోగం తిరిగి జూన్ 19కి వాయిదా పడింది. మళ్లీ అనివార్య కారణాల చేత జూన్ 22కి వాయిదా పడింది. తిరిగి ఇన్ని రోజులకు జూన్ 25న యాత్ర ప్రారంభం అవుతోంది. యాత్ర సక్సెస్ కావాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. ఇక భారత వ్యోమగామి శుభాంశుకి భారతీయులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ENG vs IND: ఒక్క టెస్టులో 5 సెంచరీలు.. కానీ ఏం లాభం..?
తాజావార్తలు
-
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
-
Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
-
Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
-
IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?