India will beat China: ఈ ఏడాది చైనాపై పైచేయి సాధించి నంబర్-1గా ఎదగనున్న ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India will beat China: మన దేశం నుంచి బ్రిటన్కి వెళ్లే విద్యార్థుల సంఖ్య నాలుగైదేళ్ల కిందట దాదాపు 20 వేలు మాత్రమే ఉండేది. కానీ ఈ సంఖ్య గతేడాది ఏకంగా లక్ష వరకు చేరింది. ఈ సంవత్సరం మరింత పెరగనుందని భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు చైనా నంబర్-1 ప్లేస్లో ఉండేది. ఈ ఏడాదితో ఇండియా చైనాపై పైచేయి సాధించటం ద్వారా అగ్రస్థానానికి ఎదగనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాల గురించి ఇండియాలోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తెలిపారు.
”ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న శుభ సందర్భంలో ఈ సంవత్సరం ఇండియన్ స్టూడెంట్స్కి బ్రిటన్ 75 చెవెనింగ్ స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తోంది. గతంలో ఎప్పుడూ ఇన్ని ఇవ్వకపోవటం గమనార్హం. వచ్చే ఏడాది నుంచి మరింత మంది స్పాన్సర్లు చేరనున్నారు. దీంతో ఇంకా ఎక్కువ స్కాలర్షిప్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఇటీవలే అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. దీని ప్రకారం విద్యార్హతలకు పరస్పర గుర్తింపు లభించనుంది.
Also Read
- India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
- Bangladesh: బంగ్లాదేశ్లో రాముడి విగ్రహ వివాదం.. రాడికల్ ఇస్లామిస్ట్ల బెదిరింపులు..
- US-Iran: శాంతి ఒప్పందంపై ప్రతిష్టంభన.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
- Donald Trump: భారత్పై దాడి జరిగితే అమెరికా అండగా ఉంటుంది.. ట్రంప్ భారీ హామీ
Russia will buy Rupees: మన కరెన్సీ రూపాయిని భారీగా కొననున్న రష్యా
ఈ అవగాహన ఒప్పందం పరిధిలో మారిటైం ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ వర్కర్ల కోసం రూపొందించిన ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ కూడా ఉన్నాయి. దీంతో యూకే మాస్టర్స్ డిగ్రీని ఇండియాలో గుర్తిస్తారు. బ్రిటన్ పౌరులు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు లేదా పీహెచ్డీలు చేసేందుకు ఇకపై ఎలాంటి ఆటంకాలూ ఎదురుకావు. రెండు దేశాల మధ్య విశ్వాసం, నమ్మకం పెరగటానికి ఇలాంటి చర్యలు ఎంతగానో దోహదపడతాయి.
ఇరు దేశాల మధ్య విద్యార్థుల, ప్రజల రాకపోకలు ఇప్పటికే ఓ స్థాయిలో సాగుతున్నాయి. ఇవి రానున్న రోజుల్లో మరింత పెరగనున్నాయి. ఇండియన్ మాస్టర్స్ డిగ్రీలను మేమూ గుర్తిస్తాం. భారతీయులు బ్రిటన్లో జాబ్స్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. బ్రిటన్ జారీ చేసే ఆల్ స్కిల్డ్ వర్క్ వీసాల్లో 44% వరకు ఇండియన్లకే వస్తాయి. ఇండియా యూకే మార్కెట్తో మరింత మమేకమయ్యేందుకు స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం దోహదపడుతుంది.
రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మెరుగుపడతాయి. ఒప్పందంపై చర్చలు ఈ నెలాఖరుకి ముగుస్తాయి. దీంతో ఇరు దేశాలకు వ్యూహాత్మక ప్రయోజనాలు, టారిఫ్ల తగ్గింపు వంటి సువర్ణావకాశాలు అందుబాటులోకి వస్తాయి” అని ఇండియాలో బ్రిటిషన్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!