Ind-Pak: పాక్‌కు భారత్ నెం.1 శత్రువు కాగా.. తర్వాత ఈ దేశాలే.. అసిమ్ మునీర్ వైఖరిపై సంచలన సర్వే

  • పాక్‌కు భారత్ నెం.1 శత్రువు
  • అసిమ్ మునీర్ వైఖరిపై సంచలన సర్వే
Indpak

Indpak

భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 ఏళ్లు గడిచినా భారత్-పాకిస్థాన్ మధ్య వైరం మాత్రం అలాగే ఉంది. అమెరికన్ థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ తాజాగా ఓ సంచలన రిపోర్ట్ బయటపెట్టింది. ఈ నివేదికలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. ఇక భారతదేశాన్ని పాకిస్థాన్ ప్రధాన శత్రువుగా భావిస్తుండగా.. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, ఇజ్రాయెల్ ఉండడం ఆశ్చర్యం కలిగించింది. ఓ వైపు అసిమ్ మునీర్ అమెరికా ముందు చేతులు చాచినప్పటికీ.. రెండో స్థానంలో అమెరికా శత్రువుగా ఉన్నట్లుగా సర్వే పేర్కొంది.

క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఏంటంటే.. పాకిస్థాన్ ప్రజలు అమెరికాను అతి పెద్ద ముప్పుగా.. శత్రువుగా భావించడం విశేషం. ఈ సర్వే పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని పూర్తిగా బయటపెట్టింది. పైకి బాగానే ఉన్నా.. లోపలి మాత్రం అగ్ర రాజ్యాన్ని శత్రువుగానే భావిస్తోంది. ఓ వైపు వ్యక్తిగత, ఆర్థిక లాభం కోసం అమెరికాకు దాసోహం చేస్తుంటే.. ఇంకోవైపు తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకుంటుంది.

ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వేలో 54 శాతం మంది భారతీయులు పాకిస్థాన్‌ను తమ దేశానికి అతిపెద్ద భద్రతా ముప్పుగా భావిస్తున్నారు. అలాగే 21 శాతం మంది భారతీయులు చైనాను భారతదేశానికి అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తున్నారు. ఇక పాకిస్థాన్‌లో 43 శాతం మంది ప్రజలు భారతదేశాన్ని తమ నంబర్ వన్ శత్రువుగా భావిస్తున్నారు. భారతదేశం తర్వాతి స్థానంలో 24 శాతం మంది పాకిస్థానీలు యునైటెడ్ స్టేట్స్‌ను.. మరో 24 శాతం మంది ఇజ్రాయెల్‌ను తమకు అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తున్నారు. అంటే పాకిస్థాన్ వాషింగ్టన్‌తో రక్షణ, ఆర్థిక ఒప్పందాలు చేసుకుంటున్నప్పటికీ అక్కడి ప్రజల హృదయాల్లో మాత్రం అమెరికా పట్ల భీకరమైన ద్వేషం ఉంది.

ప్రపంచ శక్తులను విశ్వసించే విషయంలో భారత్, పాకిస్థాన్‌ల మార్గాలు తీవ్రంగా విభిన్నంగా ఉన్నాయి. సర్వే ప్రకారం 36 శాతం మంది భారతీయులు రష్యాను తమ అత్యంత విశ్వసనీయ మిత్రదేశంగా భావిస్తుండగా.. ఆ తర్వాతి 16 శాతం మంది అమెరికాను తమ ప్రధాన భాగస్వామిగా పరిగణిస్తున్నారు. భారతదేశంలో 58 శాతం మంది రష్యాను ఇష్టపడగా.. 51 శాతం మంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఎంతగానో ఇష్టపడ్డారు.

మరోవైపు 75 శాతం మంది పాకిస్తానీయులు చైనాను అత్యంత నిజమైన స్నేహితుడిగా భావిస్తున్నారు. 90 శాతం పాకిస్తానీయులు చైనా పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారు. 83 శాతం మంది చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. చైనా తర్వాత పాకిస్తానీయులకు సౌదీ అరేబియాపై నమ్మకం చాలా తక్కువ ఉంచారు. కేవలం 12 శాతమే నమ్మకం ఉంచారు.

భారతదేశంలో సర్వే చేయబడిన వయోజనులలో 54 శాతం మంది పాకిస్థాన్‌ను అతిపెద్ద భౌగోళిక రాజకీయ ముప్పుగా అభివర్ణించగా.. ఆ తర్వాతి స్థానంలో 21 శాతంతో చైనా నిలిచింది. ఇక ప్రపంచ వ్యవహారాల్లో ట్రంప్ సరైన పని చేస్తారని కేవలం 12 శాతం మంది పాకిస్థానీయులు మాత్రమే విశ్వాసం ఉంచగా.. చైనా అధ్యక్షుడు న్‌పింగ్‌పై మాత్రం 83 శాతం మంది మంచి అభిప్రాయం కలిగి ఉన్నారని ప్యూ రీసెర్చ్ కనుగొంది.

శ్రీలంక వాసుల్లో అత్యధిక శాతం 79 శాతం మంది భారతదేశం పట్ల సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేస్తుండగా.. బంగ్లాదేశీయులలో 42 శాతం, పాకిస్థానీయుల్లో 7 శాతం మంది మాత్రమే అలా చేస్తున్నారు. 63 శాతం శ్రీలంక వాసులు భారతదేశాన్ని తమ అత్యంత ముఖ్యమైన మిత్రదేశంగా పేర్కొంటుండగా.. బంగ్లాదేశీయులు, పాకిస్థానీయుల్లో చాలామంది భారతదేశాన్ని తమ అతిపెద్ద ముప్పుగా పేర్కొన్నారు.

భారతదేశంపై అమెరికా అభిప్రాయం

అమెరికాలో 45 శాతం మంది అమెరికన్లు భారతదేశాన్ని అనుకూలంగా చూస్తుండగా.. 50 శాతం మంది ప్రతికూలంగా చూస్తున్నారు. రిపబ్లికన్లలో 42 శాతం మందితో సానుకూలంగా ఉంటే.. డెమొక్రాట్ల స్వతంత్రులలో ఏకంగా 50 శాతం మంది భారతదేశం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారు.