Donald Trump: ‘‘భారత్ చాలా ఆలస్యం చేసింది’’.. సుంకాలపై ట్రంప్ బిగ్ కామెంట్స్..
- టారిఫ్స్ తగ్గించడానికి ఇండియా ఆఫర్ చేసింది..
- ఇప్పటికే భారత్ చాలా ఆలస్యం చేసింది..
- సుంకాల విధింపుపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- పుతిన్, జిన్పింగ్తో మోడీ మీటింగ్ తర్వాత ట్రంప్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇండియాపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. భారతదేశం అమెరికా వస్తువులపై తన సుంకాలను సున్నాకు తగ్గించడానికి ఆఫర్ చేసిందని, అయితే న్యూఢిల్లీ కొన్ని ఏళ్లకు ముందే ఈ పని చేయాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని సోమవారం ట్రంప్ అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంపై 25 శాతం పరిస్పర సుంకాలను విధించడంతో పాటు, రష్యా చమురు కొంటున్నామనే కారణంగా మరో 25 శాతం మొత్తంగా 50 శాతం సుంకాలనున విధించింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం.
Read Also: Donald Trump: ‘‘తా చెడ్డ ట్రంప్’’.. ఇజ్రాయిల్, ఈయూని చెడగొట్టే ప్రయత్నం..
Also Read
- Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
- Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
- US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
‘‘వారు ఇప్పుడు తమ సుంకాలను తగ్గించుకోవడానికి ముందుకొచ్చారు. కానీ ఆలస్యం జరిగింది. వారు సంవత్సరాల క్రితమే అలా చేసి ఉండాలి’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ‘‘ఏకపక్ష విపత్తు’’గా అభివర్ణించారు. చైనాలోని టియాంజిన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్లతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సందర్భంగా ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
‘‘భారత్తో అమెరికా వ్యాపారం పూర్తిగా ఏకపక్ష విపత్తుగా మారింది, వారు మమ్మల్ని పెద్ద కస్టమర్లుగా చూస్తారు తమ ఉత్పత్తులను బల్క్గా అమ్ముకుంటారు, కానీ మేము వారికి అమ్మాలని చూస్తే వారి టారిఫ్లతో మమ్మల్ని నిలిపేస్తారు’’ అని ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కాడు. భారత్ తమ చమురును, సైనిక ఉత్పత్తుల్ని రష్యా నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తోందని, అమెరికా నుంచి తక్కువగా కొంటుందని ట్రంప్ తన తాజా పోస్ట్లో మరోసారి అన్నారు. అయితే, అమెరికా చేస్తున్న వాదనల్ని భారత్ తోసిపుచ్చింది. మార్కెట్ డైనమిక్స్ ఆధారంగా, దేశ ప్రజల ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకుంటామని ఇండియా స్పష్టం చేసింది.

Trump
తాజావార్తలు
-
Vijay OathCeremony : విజయ్ ప్రమాణస్వీకారంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా హీరోయిన్ త్రిష.
-
TVK MLAs: తొలిసారి ఎమ్మేల్యేలుగా 93 మంది టీవీకే నాయకులు.. 40 మందిపై క్రిమినల్ ఆరోపణలు!
-
Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Barley Upma Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
-
Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!