Donald Trump: ‘‘భారత్ చాలా ఆలస్యం చేసింది’’.. సుంకాలపై ట్రంప్ బిగ్ కామెంట్స్..
- టారిఫ్స్ తగ్గించడానికి ఇండియా ఆఫర్ చేసింది..
- ఇప్పటికే భారత్ చాలా ఆలస్యం చేసింది..
- సుంకాల విధింపుపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- పుతిన్, జిన్పింగ్తో మోడీ మీటింగ్ తర్వాత ట్రంప్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇండియాపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. భారతదేశం అమెరికా వస్తువులపై తన సుంకాలను సున్నాకు తగ్గించడానికి ఆఫర్ చేసిందని, అయితే న్యూఢిల్లీ కొన్ని ఏళ్లకు ముందే ఈ పని చేయాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని సోమవారం ట్రంప్ అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంపై 25 శాతం పరిస్పర సుంకాలను విధించడంతో పాటు, రష్యా చమురు కొంటున్నామనే కారణంగా మరో 25 శాతం మొత్తంగా 50 శాతం సుంకాలనున విధించింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం.
Read Also: Donald Trump: ‘‘తా చెడ్డ ట్రంప్’’.. ఇజ్రాయిల్, ఈయూని చెడగొట్టే ప్రయత్నం..
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
‘‘వారు ఇప్పుడు తమ సుంకాలను తగ్గించుకోవడానికి ముందుకొచ్చారు. కానీ ఆలస్యం జరిగింది. వారు సంవత్సరాల క్రితమే అలా చేసి ఉండాలి’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ‘‘ఏకపక్ష విపత్తు’’గా అభివర్ణించారు. చైనాలోని టియాంజిన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్లతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సందర్భంగా ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
‘‘భారత్తో అమెరికా వ్యాపారం పూర్తిగా ఏకపక్ష విపత్తుగా మారింది, వారు మమ్మల్ని పెద్ద కస్టమర్లుగా చూస్తారు తమ ఉత్పత్తులను బల్క్గా అమ్ముకుంటారు, కానీ మేము వారికి అమ్మాలని చూస్తే వారి టారిఫ్లతో మమ్మల్ని నిలిపేస్తారు’’ అని ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కాడు. భారత్ తమ చమురును, సైనిక ఉత్పత్తుల్ని రష్యా నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తోందని, అమెరికా నుంచి తక్కువగా కొంటుందని ట్రంప్ తన తాజా పోస్ట్లో మరోసారి అన్నారు. అయితే, అమెరికా చేస్తున్న వాదనల్ని భారత్ తోసిపుచ్చింది. మార్కెట్ డైనమిక్స్ ఆధారంగా, దేశ ప్రజల ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకుంటామని ఇండియా స్పష్టం చేసింది.

Trump
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!