India Economy: ఆసియాలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ఎకానమీగా ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Economy: ఈ ఆర్థిక సంవత్సరంలో ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ఎకానమీగా ఇండియా నిలవనుంది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గ్రోత్ సగటున ఏడు శాతానికి చేరుతుంది. తద్వారా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బలమైన ఎకానమీగా ఇండియా ఎదగనుందని మోర్గాన్ స్టాన్లీ అనలిస్టులు అంచనా వేశారు. వచ్చే పదేళ్లలో అత్యుత్తమ పనితీరుకు ఇది సంకేతమని వెల్లడించారు. ఆసియా వృద్ధిలో 28 శాతం, ప్రపంచ పురోగతిలో 22 శాతం వాటాను ఇండియా ఎకానమీ ఆక్రమించనున్నట్లు పేర్కొన్నారు.
10 రెట్లు కానున్న ఫిన్టెక్ మార్కెట్
Also Read
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
మరో ఎనిమిదేళ్లలో.. అంటే 2030 నాటికి ఇండియన్ ఫిన్టెక్ మార్కెట్ 10 రెట్లు పెరగనుంది. ఆస్తుల విలువ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరనుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలు వెన్నెముకగా నిలవనున్నాయి. డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ, యూపీఐ లావాదేవీలు ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. ఈ విషయాన్ని Chiratae వెంచర్స్-ఈవై రిపోర్ట్ వెల్లడించింది. ప్రస్తుతం మన దేశంలో 21 ఫిన్టెక్ యూనికార్న్లు ఉన్నాయి. అతిపెద్ద ఫిన్టెక్ యూనికార్న్ ఎకోసిస్టమ్గా ఇండియా గుర్తింపు పొందింది.
KCR to go Bihar: బీహార్ వెళ్లనున్న కేసీఆర్. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్వరలో ప్రయాణం.
కోలుకుంటున్న ‘ఎంఎస్ఎంఈ’
మన దేశంలో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) రంగం కొవిడ్ పూర్వపు స్థాయిలకు కోలుకుంటోంది. ఈ సెక్టార్లో క్రెడిట్ డిమాండ్ 60% పెరిగింది. ఏడాది కాలంగా మొండి బకాయిల సంఖ్య (ఎన్పీఏలు) నియంత్రణలోనే ఉంది. పెరగకపోవటం గమనార్హం. ఈ మేరకు ఈసీఎల్జీఎస్ అనే కేంద్ర ప్రభుత్వ పథకం ఊతంగా నిలిచింది. ఈసీఎల్జీఎస్ అంటే.. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. ఎంఎస్ఎంఈ రంగం రికవర్ అవుతున్న విషయాన్ని ట్రాన్స్యూనియన్ సిబిల్-సిడ్బి రిపోర్ట్ వెల్లడించింది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
ఇవాళ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమై, కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకొని, అలాగే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 57 పాయింట్లు తగ్గి 58795 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ దాదాపు 10 పాయింట్లు తగ్గి 17500కి దిగువన ట్రేడ్ అవుతోంది. ఎయిర్టెల్ షేర్లు ఒక శాతం లాభపడ్డాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.23 వద్ద నిలకడగా ఉంది. ఫైన్ ఆర్గానిక్ షేర్లు 3 నెలల్లో ఏకంగా 56 శాతం పెరగటం విశేషం.
తాజావార్తలు
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..