A Rare Heist: ఇదెక్కడి దొంగతనం.. ల్యాప్టాప్, టీవీల కోసం 133 టన్నుల చికెన్ దొంగిలించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Rare Heist: ఆర్థిక సంక్షోభం, పేదరికం, నగదు కొరతతో ఇబ్బంది పడుతున్న క్యూబా దేశంలో అరుదైన దొంగతనం జరిగింది. ఆహార కొరత ఉన్న ఆ దేశంలో దొంగలు ఏకంగా 133 టన్నుల చికెన్ దొంగలించారు. దీనంతటిని విక్రయించి వచ్చిన డబ్బుతో ల్యాప్టాప్, టీవీలు, రిఫ్రిజ్రేటర్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేశారు. ఈ దొంగతనంలో 30 మందిపై అభియోగాలు మోపారు. దేశ రాజధాని హవానాలో ఈ దొంగతనం జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
Also Read
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
హవానాలోని స్టేట్ ఫెసిటిలీ సెంటర్ నుంచి 1660 తెల్లని బాక్సుల్లో చికెన్ దొంగిలించి తీసుకెళ్లారు. కమ్యూనిస్ట్ క్యూబా దేశంలో రేషన్ ప్రకారం ఈ మాంసాన్ని ప్రజలకు ఇవ్వాల్సి ఉంది. దీన్నే దొంగలు దొంగిలిచినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పంపిణీదారు COPMAR డైరెక్టర్ రిగోబెర్టో ముస్టెలియర్ మాట్లాడుతూ.. దొంగిలించబడిన చికెన్ ఒక ప్రావిన్స్ నెల రోజుల రేషన్ చికెన్కి సమానమని చెప్పారు.
చికెన్ దొంగతనానికి సంబంధించి ఖచ్చితమైన సమయాన్ని పేర్కొనపోయినప్పటికీ.. అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య కోల్డ్ స్టోరేజి సదుపాయంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల్ని గమనించినట్లు, సీసీటీవీ ఫుటేజీలో చికెన్ నిల్వ స్థావరం నుంచి ట్రక్కుల్లో తీసుకెళ్తున్నట్లు రికార్డైంది. అభియోగాలు మోపబడిన 30 మందిలో ప్లాంట్ లోని షిఫ్ట్ అధికారులు, ఐటీ ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డులు, కంపెనీలతో నేరుగా సంబంధం లేని బయటి వ్యక్తులు కూడా దొంగతనంలో పాల్గొన్నట్లు తేలింది. నిందితులు దోషులుగా తేలితే 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత క్యూబా దేశంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో ఆ దేశంలో దొంగతనాలు పెరిగాయి.
తాజావార్తలు
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
-
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!