ఇటలీలో ఘోర ప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పైలట్ సహా ఏడుగురు మృతిచెందారు. అయితే మృతుల్లో నలుగురు టర్కీకి చెందినవారు కాగా.. ఇద్దరు లెబనీస్ పౌరులు. గురవారం ఓ ప్రవేట్ చాపర్ ఉత్తర-మధ్య ఇటలీలో దట్టమైన అడవులు, పర్వతప్రాంతంలోకి వెళ్లాక అదృశ్యమైంది. ఈ క్రమంలో రాడార్ సంబంధాలు తెగిపోవడంతో.. గాలింపు చేపట్టిన అగ్నిమాపక సిబ్బందికి ఎలాంటి ఆచూకీ లభించలేదు.
అయితే శనివారం ఉదయం ఓ పర్వతారోహకుడు హెలికాప్టర్ శకలాలను గుర్తించి అధికారులకు సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన వారు సహాయక చర్యలు చేపట్టారు. మొదట ఐదు మృతదేహాలను గుర్తించగా.. ఆ తర్వాత మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. దీంతో హెలికాప్టర్లో ఉన్న ఏడుగురు మరణించినట్లైంది. దట్టమైన అడవి కావడం వల్ల హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశాన్ని త్వరగా గుర్తించలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతమంటా చెట్లు ఉండటం వల్ల సహాయక చర్యలకు ఇబ్బంది తలెత్తిందని, మొదట హెలికాప్టర్ కూలిన 10 కిలోమీటర్ల దూరంలో గాలింపు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. రాడార్ వ్యవస్థతో సంబంధాలు లేకపోవడం వల్ల హెలికాప్టర్ జాడ కనిపెట్టలేకపోయినట్లు అధికారులు వివరించారు.