Hantavirus Outbreak 2026: క్రూయిజ్ షిప్లో హంటా వైరస్ కలకలం.. ఆస్ట్రేలియా ల్యాబ్లో మాయమైన వైరస్ శాంపిల్స్!
- విహార యాత్రలో విషాదం..
- ముగ్గురిని మింగేసిన ప్రాణంతక వైరస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hantavirus Outbreak 2026: సముద్ర ప్రయాణంలో విహరిస్తున్న పర్యాటకులను ఇప్పుడు ‘హంటా వైరస్’ వణికిస్తోంది. ‘ఎంవీ హోండియస్’ అనే క్రూయిజ్ షిప్లో ప్రయాణిస్తున్న వారిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. అసలేం జరిగిందంటే.. నెదర్లాండ్స్కు చెందిన భార్యాభర్తలు (ఇద్దరి వయస్సు 69 ఏళ్లు) అర్జెంటీనాలోని ఉషుయా నగరాన్ని సందర్శించినప్పుడు ఈ వైరస్ బారిన పడ్డారు. పక్షుల కోసం వారు ఒక ల్యాండ్ఫిల్ సైట్కు వెళ్లినప్పుడు, అక్కడ ఎలుకల ద్వారా ఈ వైరస్ వారికి సోకినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇదే సమయంలో ఏప్రిల్ 11న జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ భర్త మరణించారు. సెయింట్ హెలెనాలో ఏప్రిల్ 24న నిర్వహించిన భర్త అంత్యక్రియల సమయంలో భార్య కూడా అస్వస్థతకు గురైంది. ఇదే సమయంలో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 26న జోహన్నెస్బర్గ్లో కన్నుమూసింది. మే 2న అదే నౌకలో ప్రయాణిస్తున్న జర్మనీ పౌరుడు ఒకరు ఈ వైరస్ లక్షణాలతో మరణించారు. వైల్డ్లైఫ్ ఫోటోగ్రాఫర్, మాజీ పోలీస్ అధికారి మార్టిన్ ఆన్స్ట్రీ (56) కూడా ఈ వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నెదర్లాండ్స్లోని ఒక ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉన్న ఆయన, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. ఈ వైరస్ చాలా వేగంగా ప్రాణాపాయ స్థితికి చేరుస్తుందని, అయితే ప్రస్తుతం మార్టిన్ ప్రమాదం నుంచి బయటపడ్డారని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Also Read
- Pakistan: బ్రహ్మోస్కు పోటీగా ఫతా-3 క్షిపణిని తీసుకొచ్చిన పాకిస్తాన్..
- Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత
- Military Tension: ఖేష్మ్, బందర్ అబ్బాస్పై అమెరికా దాడులు.. హార్ముజ్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
మాయమైన వైరస్ శాంపిల్స్..
మరోవైపు రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని ఒక ల్యాబ్ నుంచి 300 వయల్స్ (vials) మాయమవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందులో రెండు వయల్స్లో అత్యంత ప్రమాదకరమైన ‘హంటా వైరస్’ ఉంది. ఫ్రీజర్ మార్పిడి సమయంలో ఈ శాంపిల్స్ కనిపించకుండా పోయాయి. అయితే ఇవి దొంగిలించబడలేదని, పొరపాటున ధ్వంసం అయి ఉండవచ్చని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం క్రూయిజ్ షిప్లో వ్యాపిస్తున్న వైరస్కు, ల్యాబ్లో మాయమైన శాంపిల్స్కు ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.
హంటా వైరస్ అంటే ఏమిటి..
ఇది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల విసర్జితాలు, లాలాజలం లేదా అవి కరిచినప్పుడు మానవులకు సోకుతుంది. ప్రారంభంలో సాధారణ జ్వరంలా అనిపించినా, తర్వాత కాలంలో ఊపిరితిత్తులు, కిడ్నీల మీద తీవ్ర ప్రభావం చూపి ప్రాణాపాయానికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ‘ఎంవీ హోండియస్’ నౌకలో పరిస్థితులను అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Hantavirus Outbreak 2026: క్రూయిజ్ షిప్లో హంటా వైరస్ కలకలం.. ఆస్ట్రేలియా ల్యాబ్లో మాయమైన వైరస్ శాంపిల్స్!
-
Peddi: బాక్సాఫీస్ బద్దలే.. మెగా దాహం తీర్చనున్న పెద్ది?
-
Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. తొలి బీజేపీ సీఎంగా రికార్డ్..
-
INDIA Bloc: ఇండియా కూటమికి డీఎంకే గుడ్బై.. బయటకొచ్చినట్లు ప్రకటన
-
Pakistan: బ్రహ్మోస్కు పోటీగా ఫతా-3 క్షిపణిని తీసుకొచ్చిన పాకిస్తాన్..