Hamas-US: కాల్పుల విరమణపై అమెరికా చర్చలు.. హమాస్ తిరస్కరణ
- కాల్పుల విరమణపై అమెరికా చర్చలు
- పూర్తి వ్యతిరేకంగా ఉందని హమాస్ తిరస్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాల్పుల విరమణపై హమాస్తో అమెరికా మరోసారి చర్చలు జరిపింది. బందీల విడుదల, గాజాలో కాల్పుల విరమణపై హమాస్తో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ చర్చలు జరిపారు. కానీ అమెరికా ప్రతిపాదనలను హమాస్ తిరస్కరించింది. అమెరికా ప్రతిపాదనలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని హమాస్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Kishan Reddy: కవిత ఎపిసోడ్పై స్పందించొద్దు.. బీజేపీ నేతలకు కిషన్రెడ్డి కీలక సూచనలు..!
Also Read
- Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
- Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
- Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
- Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సంతకం చేసిందని వైట్హౌస్ తెలిపింది. బందీల విడుదల, ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనా ఖైదీల విడుదల, దీనికి బదులుగా చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల, అలాగే మృతదేహాలను అప్పగించాలని హమాస్ దగ్గర అమెరికా ప్రతిపాదన పెట్టింది. అందుకు హమాస్ ససేమిరా అంది. యుద్ధం ముగించే ఆలోచన అమెరికా దగ్గర లేదని.. కేవలం బందీల కోసమే అమెరికా కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిందని.. తగిన సమయంలో స్పందిస్తామని హమాస్కు చెందిన ఒక సీనియర్ అధికారి మీడియాకు తెలిపాడు.
ఇది కూడా చదవండి: Kishan Reddy: ఆ ముగ్గురూ సైనికుల సాహసాన్ని అవమానిస్తున్నారు.. కిషన్రెడ్డి ఫైర్..!
అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. తొలి ఒప్పందం ప్రకారం అంతా బాగానే జరిగింది. తొలి ఒప్పందాన్నే కొనసాగించాలని ఇజ్రాయెల్ పట్టుబట్టింది. అందుకు హమాస్ అంగీకరించలేదు. దీంతో తిరిగి ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది. హమాస్ అంతమే లక్ష్యంగా భీకరదాడులు చేసింది. దీంతో భారీగా నష్టం జరిగింది.
అయితే తాజాగా మరోసారి బందీల విడుదలకు అమెరికా కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇజ్రాయెల్ అంగీకరించినా.. హమాస్ మాత్రం అందుకు అంగీకరించలేదు. అమెరికా ప్రతిపాదనలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని హమాస్ అంటోంది.
ప్రస్తుతం హమాస్ దగ్గర 50 మంది బందీలు ఉన్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. అందులో 20 మంది సజీవంగా ఉన్నట్లు నమ్ముతోంది. అయితే ఇటీవల బాధిత కుటుంబాలతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. బందీల ఒప్పందానికి అంగీకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు అమెరికా సాయంతో ఇజ్రాయెల్ కొత్త ప్రతిపాదన పెట్టింది. అయితే ఇది కేవలం బందీలు-ఖైదీల విడుదలకు మాత్రమే పరిమితమని.. యుద్ధం ముగింపునకు కాదని హమాస్ భావించి ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
ఇక ఆక్రమిత వెస్ట్బ్యాంక్లో 22 కొత్త యూదు ఆవాసాల ఏర్పాటుకు ఇజ్రాయెల్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ఇజ్రాయెల్ ప్రకటించింది. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ వెస్ట్బ్యాంక్ను ఆక్రమించింది. అప్పటినుంచి అక్కడికి ఇజ్రాయెలీ పౌరులను తరలిస్తూ ఉంది. అక్కడ ఇజ్రాయెల్ పౌరుల కోసం వందల సంఖ్యలో అపార్టుమెంట్లు నిర్మించింది. అయితే ఈ తరలింపును వెస్ట్బ్యాంక్లోని 30 లక్షల మంది పాలస్తీనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?