Ecuador: ఈక్వెడార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. 15 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
15 killed in Ecuador prison violence: లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్ లోని ఓ జైలులో ఖైదీల మధ్య తీవ్రఘర్షణ చెలరేగింది. ఈక్వెడార్ లోని లటాకుంగాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణల కారణంగా 15 మంది ఖైదీలు మరణించారు. ఈ ఘర్షణల కారణంగా మరో 21 మంది గాయపడ్డారు. మాదకద్రవ్యాల రవాణా మార్గాలపై ముఠాల మధ్య ఘర్షణకు కారణమయ్యాయని అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో అన్నారు. ప్రస్తుతం అధికారులు మృతదేశాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఇతర ప్రావిన్సుల్లో భద్రతను పెంచామని అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో 14 మంది శవాలను ఆస్పత్రికి తరలించారు.
Read Also: Loan app Harassment: లోన్ యాప్ వేధింపులకు ఐటీ ఉద్యోగి బలి.. రుణం చెల్లించినా ఆగని వేధింపులు
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ఈ ఏడాది ఈక్వెడార్ లోని పలు జైళ్లలో జరిగిన ఘర్షణల కారణంగా 316 మంది ఖైదీలు మరణించారు. జూలైలో శాంటా డొమింగోలోని జైలులో ఇలాగే ఖైదీల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంట్లో 13 మంది ఖైదీలు మరణించారు. మేలో ఇదే జైలులో జరిగిన హింసాత్మక దాడుల్లో 43 మంది మరణించారు. ఈక్వెడార్ జైలు వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేయడంతో పాటు సమగ్ర విధానం లేకపోవడంతో ఖైదీలు అధ్వాన్న పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఇంటర్-అమెరికన్ కమీషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. అధికారిక గణాంకాల ప్రకారం.. ఈక్వెడార్ జైళ్లలో మొత్తం 33,500 మంది ఉన్నారని.. ఇది జైళ్ల గరిష్ట సామర్థ్యం కన్నా 11.3 శాతం అని పేర్కొంది.
లాటిన్ అమెరికాలోని పలు దేశాల మాదకద్రవ్యాల మాఫియా ముఠాలకు కేంద్రంగా ఉన్నాయి. మెక్సికో, ఈక్వెడార్, కొలంబియా, గ్వాటేమాల, ఎల్ సాల్విడార్, పూర్టోరికో, పెరూ వంటి దేశాల్లో డ్రగ్స్ ను ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తున్నాయి. బ్రెజిల్ లోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కొకైన్ డ్రగ్స్ ఉత్పత్తికి అడ్డాగా ఉంది. దక్షిణ అమెరికా దేశాల నుంచి యూఎస్ఏకు పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల్ని సరఫరా చేస్తుంటారు స్మగ్లర్లు. ఎప్పటికప్పుడు అక్కడి ప్రభుత్వాలు ఈ డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేస్తుంటారు. అయితే జైళ్లలో ఉన్న ఈ ముఠాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా తరుచు హింసాత్మక సంఘటనలు జరుగుతుంటాయి. ఈ ఘటనల్లో ఖైదీలు మరణిస్తుంటారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!