Solar storm: గంటకు 21 లక్షల కి.మీ వేగంతో భూమిని ఢీకొన్న ‘‘సౌర తుఫాను’’.. ఏం జరిగిందంటే..
- భూమిని ఢీకొట్టిన శక్తివంతమైన ‘‘సౌర తుఫాను’’..
- తీవ్ర ఒత్తిడికి లోనైన భూ అయస్కాంత క్షేత్రం..
- శాటిలైట్లు, విద్యుత్ గ్రిడ్స్కి హై అలర్ట్..
Solar storm: భూమి పైకి శక్తివంతమైన సౌర తుఫాను దూసుకు వచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. సెకనుకు 600 కి.మీ అంటే గంటకు సుమారుకుగా 21 లక్షల కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాను భూమిని ఢీకొట్టింది. దీని ప్రభావంతో భూమి ‘‘అయస్కాంత క్షేత్రం’’ తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు తెలిసింది. ఆగస్టు 20న సూర్యుడిపై ఉన్న AR 4199 చురుకైన ప్రాంతం నుంచి M2.7-క్లాస్ సౌర జ్వాల (solar flare) విడుదలైంది. దీని తర్వాత వెంటనే అనేక కరోననల్ మాస్ ఎజెక్షన్స్(CMEs) విడుదలయ్యాయి. ఇవి ఒకదానితో ఒకటి కలిసి అత్యంత ప్రమాదకరమైన కానిబల్ CMEగా మారాయి. ఇలా ఒకదానితో ఒకటి కలిసి పోవడంతో వీటి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ సౌర తుఫానులు G1 (తక్కువ) నుండి G3 (బలమైన) స్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 1న రాత్రి సమయంలో ఈ సౌర తుఫాను భూమిని ఢీకొట్టింది. వీటి ఫలితంగా ధ్రువాలకు సమీపంలో అరోరాలు కనిపించాయి. పవర్ గ్రిడ్స్, జీపీఎస్, కమ్యూనికేషన్ శాటిలైట్లు, హై ఫ్రీక్వెన్నీ రేడియో వ్యవస్థలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
Also Read
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
- Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
- Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
Read Also: Ashok Gajapathi Raju: గోవాకు గవర్నర్గా వెళ్లడం నా అదృష్టం: అశోక్ గజపతి రాజు
భూమికి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఉండటంతో సూర్యుడి నుంచి వచ్చే ఛార్జ్డ్ పార్టికల్స్, ప్లాస్మాని తిప్పికొడుతుంది. శక్తివంతమైన సౌర తుఫాను వచ్చినప్పుడు భూమి అయస్కాంత క్షేత్రం ఒత్తిడికి గురవుతుంది. తాజాగా సంఘటనలో కూడా ఇదే జరిగింది. ఎర్త్ మాగ్నిటిక్ ఫీల్డ్ వల్ల సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదాలు భూమిపై ఉన్న జీవరాశులు తప్పించుకోగలుగుతున్నాయి.
ప్రస్తుతం సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్-25లో అత్యంత చురుకుగా ఉన్నాడు. ఈ సమయంలో సూర్యుడిపై భారీ విస్పోటనాలు సంభవిస్తున్నాయి. ఇవి 2025-26 నాటికి గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది. ప్రతీ 11 ఏళ్లకు సూర్యుడి ధృవాలు మారుతుంటాయి. ఈ సమయంలో సూర్యడి వాతావరణం చాలా క్రియాశీలకంగా ఉంటుంది. భారీ గురుత్వాకర్షణ శక్తి కారణంగా సన్స్పాట్స్ ఏర్పడుతుంటాయి. వీటి నుంచి ఒక్కసారిగా పేలుళ్లు జరిగి అయస్కాంత క్షేత్రాలు, ప్లాస్మా సౌర కుటుంబంలోకి ఎగిసిపడుతుంది. ఇది ప్రయాణిస్తూ గ్రహాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!