Donald Trump: భారత్- అమెరికా సంబంధాలు దెబ్బ తీసేలా ట్రంప్ వ్యాఖ్యలు..
- భారత్- అమెరికా సంబంధాలు దెబ్బ తీసేలా ట్రంప్ వ్యాఖ్యలు..
- భారత్-పాక్ ఉద్రిక్తతలు తిరిగి మొదలవుతాయని ట్రంప్ కామెంట్స్..
- అమెరికా-భారత్ భాగస్వామ్యాన్ని దెబ్బతీయాలని ట్రంప్ కుట్ర: విశ్లేషకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: భారత్- అమెరికా మధ్య గత 25 సంవత్సరాలుగా సంబంధాలు క్రమంగా పటిష్టం అవుతున్నాయి. కానీ, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని తీవ్రగా వ్యతిరేకిస్తున్న ట్రంప్.. భారత్ నుంచి వెళ్తున్న డబ్బును ఉక్రెయిన్తో యుద్ధానికి రష్యా ఖర్చు చేస్తోందని పలుమార్లు ఆయన ఆరోపించారు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తక్షణమే ఆపాలని ట్రంప్ డిమాండ్ చేశారు.
Read Also: TG Rains: ముసురుతో వణుకుతున్న హైదరాబాద్.. నేడు ఆరెంజ్ అలెర్ట్ జారీ
Also Read
ట్రంప్ ను పట్టించుకోని మోడీ..
అయితే, డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను భారత సర్కార్ పట్టించుకోకపోవడంతో ప్రతీకార చర్యల కింద 50 శాతం టారిఫ్లను అమలు చేస్తోంది. భారత్- రష్యా సంబంధాల గురించి తాను పట్టించుకోనని, ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు దారుణంగా పడిపోతాయని శాపనార్థాలు సైతం పెట్టారు. ఇక, ట్రంప్కు ప్రధాని మోడీ గట్టిగా సమాధానం ఇచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యమని వెల్లడించారు. టారిఫ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు.
Read Also: Trump Tariffs India: నేటి నుంచే భారత్పై 50 శాతం సుంకాలు అమలు..
ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. మోడీని ‘టెర్రిఫిక్ మ్యాన్’గా పేర్కొంటూ భారత్-పాక్ ఉద్రిక్తతలు తిరిగి మొదలవుతాయో లేదో తాను చెప్పలేనని, అయితే ఒకవేళ మొదలైతే తానే ఆపుతానని కవ్వించేలా వ్యాఖ్యానించారు. యూఎస్-భారత్ భాగస్వామ్యాన్ని దెబ్బతీయాలని ట్రంప్ యత్నిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు అంచనాలు వేస్తున్నారని కూడా అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!