Flesh-Eating Bacteria: యూఎస్ఏలో పెరుగుతున్న “మాంసం తినే బ్యాక్టీరియా”..
Flesh-Eating Bacteria: అమెరికా తీర ప్రాంత ప్రజలను ఇప్పుడో కొత్తరకం బ్యాక్టీరియా కలవరపెడుతోంది. అత్యంత ప్రాణాంతకం అయిన బ్యాక్టీరియా ‘‘ విబ్రియో వల్నిఫికస్’’ కారణంగా అంటువ్యాధులు పెరుగుతున్నాయి. దీన్ని సాధారణంగా ‘‘మాంసాన్ని తినే బ్యాక్టీరియా’’గా పిలుస్తుంటారు. యూఎస్ తీరం చుట్టూ వేడెక్కుతున్న జలాలు ఈ బ్యాక్టీరియా పెరుగుదలకు కారణం అవుతున్నాయి. క్రమంగా తీరం వెంబడి కదులుతున్నాయి.
యునైటెడ్ స్టేట్స్ యొక్క డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్స్ ప్రకారం, విబ్రియో వల్నిఫికస్, ప్రాణాంతక గాయం ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. విబ్రియో వల్నిఫికస్ ఇన్ఫెక్షన్ ఉన్న చాలా మందికి ఇంటెన్సివ్ కేర్ అవసరం ఏర్పడటంతో పాటు చాలా సందర్భాల్లో బ్యాక్టీరియా సోకిన కాలు, లేదా చేతి ప్రాంతాన్ని తొలగింపుకు కారణం అవువతోంది. ఈ ఇన్ఫెక్షన్ సోకిన 5 మందిలో ఒకరు మరణిస్తున్నారు. కొన్నిసార్లు అనారోగ్యం పాలైన ఒకటి రెండు రోజుల్లోనే చనిపోవడం కలవరపరుస్తోంది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
Read Also: Karnataka Elections: తొలివిడతగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ.. 52 మంది కొత్తవారికి అవకాశం..
కొన్ని విబ్రియో వల్నిఫికస్ ఇన్ఫెక్షన్లు నెక్రోటైజింగ్ ఫాసిటిస్కు దారితీస్తాయి, దీనిలో ఒక గాయం చుట్టూ ఉన్న మాంసం చనిపోతుంది. దీని వల్లే ఈ బ్యాక్టీరియాకు ‘‘మాంసాన్ని తినే బ్యాక్టీరియా’’గా పేరొచ్చింది. అయితే ఈ రకమైన నెక్రోటైజింగ్ ఫాసిటిస్ కు ఒకటి కంటే ఎక్కువ బ్యాక్టీరియా కారణం సంభవించవచ్చు.
1988 మరియు 2016 మధ్య జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురించబడిన ఒక అధ్యయనాన్ని ఉటంకిస్తూ.. ది మెట్రో ఒక కథనం ప్రకారం, యూఎస్ఏలో 1,100 కంటె ఎక్కువ గాయాలు ఇన్ఫెక్షన్లు నమోదెు అయ్యాయి. వీటిలో 159 మంది మరణించారు. 2041-2060 మధ్యకాలంలో విబ్రియో వల్నిఫికస్ న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ వరకు వ్యాపిస్తుంది. దీంతో ఏటా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. వాతావరణ మార్పులకు సమాజం స్పందించే తీరుపై కూడా బ్యాక్టీరియా పెరుగుదల ఆధారపడి ఉంటుంది. మరింగా నీరు వేడెక్కితే కోస్తా తీరానికి మరో 1000 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన ఉన్న మైనే వరకు అంటువ్యాధులు సంభవించవచ్చు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!