NTV Telugu Site icon

Hassan Nasrallah: ఇజ్రాయెల్‌ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్‌ కుమార్తె మృతి..

Nasrulla

Nasrulla

Hassan Nasrallah: హెజ్‌బొల్లానే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తుంది. లెబనాన్‌పై భీకర స్థాయిలో విరుచుకుపడింది. దక్షిణ బీరుట్‌లోని హెచ్‌బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేయగా.. ఇందులో హెజ్‌బొల్లా అధిపతి హసన్‌ నస్రల్లా కుమార్తె జైనబ్‌ చనిపోయినట్లు సమాచారం. ఈ మేరకు ఇజ్రాయెల్‌ మీడియా సంస్థల్లో కథనాలు ప్రసారం అవుతున్నాయి. అయితే, ఆమె మృతిని హెజ్‌బొల్లా గానీ, లెబనాన్‌ అధికారులు గానీ ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు.

Read Also: PM Modi: నేడు హర్యానా, జమ్మూలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..

ఈ దాడి తర్వాత హెజ్‌బొల్లా ఆఫీస్‌ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే, ఈ దాడి సమయంలో కేంద్ర కార్యాలయంలోనే ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా ఉన్నట్టు ఇజ్రాయెల్ గుర్తించి.. బాంబులతో మెరుపు దాడి చేసిందని సమాచారం. ఈ బాంబు దాడులు ఇంకా కొనసాగుతున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, నస్రల్లాకు ఎలాంటి హాని జరగలేదని హిజ్బుల్లా తాజాగా ప్రకటించింది. ఈ ఘర్షణలో సామాన్య పౌరులు, మహిళలు, పిల్లలు వందల మంది మృతి చెందుతున్నారు. ఇజ్రాయెల్ దాడులకు రాకెట్‌లతో హిజ్బుల్లా ప్రతిదాడులను కొనసాగిస్తుంది.