Afghanistan: మహిళలకు వైద్య విద్యను నిషేధించిన తాలిబాన్..! తప్పుపట్టిన క్రికెటర్లు
- ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ రాజ్యం కఠిన నిర్ణయాలు
- మహిళలకు వైద్య విద్యను నిషేధించిన తాలిబాన్
- తప్పుపట్టిన క్రికెటర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుతం తాలిబాన్ రాజ్యం నడుస్తోంది. తాలిబాన్ పాలనలో శిక్షలు ఘోరంగా ఉంటాయి. అందుకే ప్రజలు భయాందోళన చెందుతుంటారు. ఇక మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. తాజాగా మహిళలకు వైద్య విద్యను తాలిబాన్ నిషేధించింది. నర్సింగ్, మిడ్వైఫరీ కోర్సులతో సహా వైద్య విద్యలో మహిళలు చేరకూడదని తాలిబాన్ ఆదేశించింది.

Also Read
- Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
- Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
తాలిబాన్ తీసుకున్న నిర్ణయంపై క్రికెటర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు వైద్య విద్యను నిషేధించడం హృదయ విదారకమైనదని…తీవ్ర అన్యాయం అని ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ నబీ పేర్కొన్నాడు. అమ్మాయిలకు నేర్చుకునే అవకాశాన్ని.. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నిరాకరించడం దారుణం అన్నారు. వారి కలలకు, దేశ భవిష్యత్కు ద్రోహం చేయడమే అన్నారు. తాలిబాన్ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని రషీద్ ఖాన్ కోరారు. ప్రతి ఒక్కరికీ విద్యపై హక్కు ఉందని ఇస్లాం బోధిస్తుందని గుర్తుచేశారు. బాలికల విద్యాహక్కును పునరుద్ధరించాలని కోరారు.
ఇస్లామిక్ బోధనలో విద్య ప్రధాన స్థానాన్ని కలిగి ఉందని రషీద్ ఖాన్ పేర్కొన్నారు. ఇది పురుషులకు, మహిళలకు ఇద్దరికి జ్ఞాన సాధనే అని తెలిపారు. తాలిబాన్ నిర్ణయం.. భవిష్యత్ను మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.
2021లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇస్లామిక్ చట్టానికి కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. తాజాగా మహిళల విద్యపై కత్తి పడింది. నర్సింగ్ మరియు మిడ్వైఫరీ కోర్సులలో చేరే మహిళలపై కొత్త నిషేధాన్ని విధించాలని తాలిబాన్ యోచిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. తాలిబాన్ ప్రభుత్వం నిషేధాన్ని అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. ఆయా సంస్థల్లో అమలులోకి రావడానికి ముందు తుది పరీక్షలను నిర్వహించడానికి 10 రోజుల సమయం ఇచ్చినట్లు వెల్లడించారు. తాలిబాన్ నిర్ణయాన్ని యూరోపియన్ యూనియన్ కూడా ఖండించింది.
తాజావార్తలు
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
-
CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!
-
CSK vs LSG: లక్నో ప్లేఆఫ్ ఆశలు ఆవిరి.. చెపాక్లో చెన్నై వీరవిహారం!
-
Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!