South China Sea: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కవ్వింపు.. ఫిలిప్పీన్స్ శాస్త్రవేత్తల నౌక అడ్డగింపు..
South China Sea: దక్షిణ చైనా సముద్ర విషయంలో సరిహద్దు దేశాలను చైనా తన బలాన్ని చూసుకుని కవ్విస్తోంది. ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలను బెదిరించేందుకు ప్రయత్నిస్తోంది. దురాక్రమణవాదంతో భయపెడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన శాస్త్రవేత్తల నౌకను చైనా కోస్టుగార్డు అడ్డగించింది. దీంతో కొన్ని గంటల పాలు ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి చెందిన నౌక సముద్రంలోని ఇసుక దిబ్బలపై పరిశోధన చేసేందుకు వెళ్తున్న సమయంలో, తమ నౌకకు దగ్గరగా వచ్చి చైనా అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఫిలిప్పీన్స్ ప్రతినిధి తెలిపారు. అయితే, యథావిధిగా చైనా తన తప్పేంలేదని ఖండించింది.
ఇదిలా ఉంటే, దక్షిణ చైనా సముద్ర జలాల్లో ఉండే ఇసుక దిబ్బలపై 34 మంది ఫిలిప్పీన్స్ దేశస్థులు చట్టవిరుద్ధం కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాని పలుమార్లు హెచ్చరించామని చైనా కోస్టుగార్డు చెబుతోంది. చైనా అధికారి గాన్ యూ చేసిన వ్యాఖ్యల్ని ఫిలిప్పీన్స్ ఖండించింది. చైనా కోస్టుగార్డు అబద్ధాలను ప్రచారం చేస్తోందని, సుమారు 4గంటల పాలు మా నౌక సమీపానికి వచ్చి హారన్ మోగిస్తూ, సైనిక హెలికాప్టర్తో తమను కవ్వించే ప్రయత్నం చేసిందని, తమ పరిశోధన బృందాన్ని అడ్డుకుందని ఫిలిప్పీన్స్ కోస్టుగార్డు ప్రతినిధి జైటర్రీలా తెలిపారు.
Also Read
- Modi-Trump: బెంగాల్లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్
- US: ఖతార్లో అమెరికా సైనిక విమానం అదృశ్యం.. రంగంలోకి సైన్యం!
- UAE Drone Attack: యూఏఈలో భారతీయులపై దాడి.. తమ పౌరుల రక్తం చిందితే ఊరుకోం.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక!
- Hantavirus Alert: భయపెడుతున్న హంటావైరస్.. లక్షణాలు, వ్యాప్తి, ప్రమాదాలపై వైద్యుల హెచ్చరికలు..
Read Also: Biju Menon: ఈ విలన్ భార్య హీరోయిన్.. ఎంత అందంగా ఉందో చూశారా?
దక్షిణ చైనా సముద్ర జలాలపై హక్కుల కోసం చైనా, మలేషియా, వియత్నాం, తైవాన్, బ్రూనై, మలేషియా, ఫిలిప్పీన్స్లు ప్రయత్నిస్తున్నాయి. సముద్రజలాలపై అధికారాన్ని ప్రతీ దేశం క్లెయిమ్ చేస్తుంది. అయితే, చైనాతో పోలిస్తే మిగతావి ఆర్ధికంగా, సైనికంగా చిన్న దేశాలు కావడంతో వాటిని డ్రాగన్ కంట్రీ బెదిరిస్తోంది. చైనా ఈ సముద్ర ప్రాంతాలపై ఆధిపత్యాన్ని సాధించేందుకు దక్షిణ చైనా సముద్రంలోని 25 ద్వీపాలకు పేర్లు పెట్టింది.
గతేడాది నుంచి ఈ సముద్రం జలాల్లో ఫిలిప్పీన్స్-చైనా మధ్య వివాదం ముదురుతోంది. ఈ నెల మొదట్లో రెండు దేశాల కోస్టుగార్డు నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఫిలిప్పీన్స్కి చెందిన నౌక స్వల్పంగా దెబ్బతింది. వరస ఘటనల నేపథ్యంలో అమెరికా ఫిలిప్పీన్స్కి మద్దతు తెలిపింది. ఆ దేశ సైనికులు, విమానాలు, నౌకలు దాడి చేస్తే చైనాను సహించేంది లేదని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!