PM Modi: ప్రధాని మోడీకి తైవాన్ అభినందనలు.. ఉడికిపోతున్న చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల్లో గెలుపొంది, మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే పలు దేశాల అధినేతలు ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు. అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక ఇలా పలు దేశాల అధ్యక్షుడు, ప్రధానులు తమ అభినందన సందేశాలను పంపించారు. తైవాన్ ప్రెసిడెంట్ లై చింగ్-తే కూడా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల విజయంపై నా హృదయపూర్వక అభినందనలు. ఇండోపసిఫిక్లో శాంతి, శ్రేయస్సుకు దోహదపడేలా వాణిజ్యం, సాంకేతికత ఇతర రంగాల్లో మా సహకరాన్ని విస్తరించడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న తైవాన్-భారత భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మేము ఎదురుచూస్తున్నాం’’ అంటూ తన సందేశాన్ని తెలియజేశారు.
Read Also: Yogi Babu: ఫేస్ బుక్ లవ్.. సినీ ఫక్కీలో తమ్ముడికి సీక్రెట్ గా పెళ్లి చేసిన టాప్ కమెడియన్
Also Read
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
- India - Pakistan: భారత్ - పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
- Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
తైవాన్ ప్రెసిడెంట్ లై శుభాకాంక్షలకు స్పందించిన ప్రధాని మోడీ ‘‘మీ సందేశానికి ధన్యవాదాలు, పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక మరియు సాంకేతిక భాగస్వామ్యానికి కృషి చేస్తున్నందున నేను సన్నిహిత సంబంధాల కోసం ఎదురుచూస్తున్నాను.’’ అని స్పందించారు. అయితే, ప్రస్తుతం భారత్-తైవాన్ మధ్య ఈ వ్యాఖ్యలు చైనాకు రుచించడం లేదు. భారత్ అంటేనే వ్యతిరేకించే చైనా, తనలో భాగమని చెబుతున్న తైవాన్ ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలపడంపై ఉడికిపోతోంది.
గురువారం మీడియా సమావేశంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ.. తైవాన్ ప్రాంతానికి అధ్యక్షుడు ఎవరూ లేరని చెప్పింది. ప్రపంచంలో ‘‘వన్ చైనా’’ విధానం ఉందని, ఇందులో తైవాన్ భాగమని, తైవాన్ చైనాలో విడదీయలేని భాగమని ఆమె చెప్పారు. ‘‘వన్ చైనా’’ విధానం అంతర్జాతీయ సమాజంలో ప్రబలమైన ఏకాభిప్రాయమని మావో నింగ్ అన్నారు. తైవాన్ అధ్యక్షుడికి మోడీ థాంక్స్ చెప్పడంపై చైనా భారత్కి తన నిరసన తెలిపింది. భారత్కు చైనాతో దౌత్య సంబంధాలు ఉన్నాయని మావో అన్నారు. తైవాన్ అధికారులు మరియు చైనాతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న దేశాల మధ్య అన్ని రకాల అధికారిక పరస్పర చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
-
Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
-
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
-
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?