PM Modi: ప్రధాని మోడీకి తైవాన్ అభినందనలు.. ఉడికిపోతున్న చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల్లో గెలుపొంది, మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే పలు దేశాల అధినేతలు ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు. అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక ఇలా పలు దేశాల అధ్యక్షుడు, ప్రధానులు తమ అభినందన సందేశాలను పంపించారు. తైవాన్ ప్రెసిడెంట్ లై చింగ్-తే కూడా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల విజయంపై నా హృదయపూర్వక అభినందనలు. ఇండోపసిఫిక్లో శాంతి, శ్రేయస్సుకు దోహదపడేలా వాణిజ్యం, సాంకేతికత ఇతర రంగాల్లో మా సహకరాన్ని విస్తరించడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న తైవాన్-భారత భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మేము ఎదురుచూస్తున్నాం’’ అంటూ తన సందేశాన్ని తెలియజేశారు.
Read Also: Yogi Babu: ఫేస్ బుక్ లవ్.. సినీ ఫక్కీలో తమ్ముడికి సీక్రెట్ గా పెళ్లి చేసిన టాప్ కమెడియన్
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
తైవాన్ ప్రెసిడెంట్ లై శుభాకాంక్షలకు స్పందించిన ప్రధాని మోడీ ‘‘మీ సందేశానికి ధన్యవాదాలు, పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక మరియు సాంకేతిక భాగస్వామ్యానికి కృషి చేస్తున్నందున నేను సన్నిహిత సంబంధాల కోసం ఎదురుచూస్తున్నాను.’’ అని స్పందించారు. అయితే, ప్రస్తుతం భారత్-తైవాన్ మధ్య ఈ వ్యాఖ్యలు చైనాకు రుచించడం లేదు. భారత్ అంటేనే వ్యతిరేకించే చైనా, తనలో భాగమని చెబుతున్న తైవాన్ ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలపడంపై ఉడికిపోతోంది.
గురువారం మీడియా సమావేశంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ.. తైవాన్ ప్రాంతానికి అధ్యక్షుడు ఎవరూ లేరని చెప్పింది. ప్రపంచంలో ‘‘వన్ చైనా’’ విధానం ఉందని, ఇందులో తైవాన్ భాగమని, తైవాన్ చైనాలో విడదీయలేని భాగమని ఆమె చెప్పారు. ‘‘వన్ చైనా’’ విధానం అంతర్జాతీయ సమాజంలో ప్రబలమైన ఏకాభిప్రాయమని మావో నింగ్ అన్నారు. తైవాన్ అధ్యక్షుడికి మోడీ థాంక్స్ చెప్పడంపై చైనా భారత్కి తన నిరసన తెలిపింది. భారత్కు చైనాతో దౌత్య సంబంధాలు ఉన్నాయని మావో అన్నారు. తైవాన్ అధికారులు మరియు చైనాతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న దేశాల మధ్య అన్ని రకాల అధికారిక పరస్పర చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!