PM Modi: ప్రధాని మోడీకి తైవాన్ అభినందనలు.. ఉడికిపోతున్న చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల్లో గెలుపొంది, మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే పలు దేశాల అధినేతలు ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు. అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక ఇలా పలు దేశాల అధ్యక్షుడు, ప్రధానులు తమ అభినందన సందేశాలను పంపించారు. తైవాన్ ప్రెసిడెంట్ లై చింగ్-తే కూడా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల విజయంపై నా హృదయపూర్వక అభినందనలు. ఇండోపసిఫిక్లో శాంతి, శ్రేయస్సుకు దోహదపడేలా వాణిజ్యం, సాంకేతికత ఇతర రంగాల్లో మా సహకరాన్ని విస్తరించడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న తైవాన్-భారత భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మేము ఎదురుచూస్తున్నాం’’ అంటూ తన సందేశాన్ని తెలియజేశారు.
Read Also: Yogi Babu: ఫేస్ బుక్ లవ్.. సినీ ఫక్కీలో తమ్ముడికి సీక్రెట్ గా పెళ్లి చేసిన టాప్ కమెడియన్
Also Read
తైవాన్ ప్రెసిడెంట్ లై శుభాకాంక్షలకు స్పందించిన ప్రధాని మోడీ ‘‘మీ సందేశానికి ధన్యవాదాలు, పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక మరియు సాంకేతిక భాగస్వామ్యానికి కృషి చేస్తున్నందున నేను సన్నిహిత సంబంధాల కోసం ఎదురుచూస్తున్నాను.’’ అని స్పందించారు. అయితే, ప్రస్తుతం భారత్-తైవాన్ మధ్య ఈ వ్యాఖ్యలు చైనాకు రుచించడం లేదు. భారత్ అంటేనే వ్యతిరేకించే చైనా, తనలో భాగమని చెబుతున్న తైవాన్ ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలపడంపై ఉడికిపోతోంది.
గురువారం మీడియా సమావేశంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ.. తైవాన్ ప్రాంతానికి అధ్యక్షుడు ఎవరూ లేరని చెప్పింది. ప్రపంచంలో ‘‘వన్ చైనా’’ విధానం ఉందని, ఇందులో తైవాన్ భాగమని, తైవాన్ చైనాలో విడదీయలేని భాగమని ఆమె చెప్పారు. ‘‘వన్ చైనా’’ విధానం అంతర్జాతీయ సమాజంలో ప్రబలమైన ఏకాభిప్రాయమని మావో నింగ్ అన్నారు. తైవాన్ అధ్యక్షుడికి మోడీ థాంక్స్ చెప్పడంపై చైనా భారత్కి తన నిరసన తెలిపింది. భారత్కు చైనాతో దౌత్య సంబంధాలు ఉన్నాయని మావో అన్నారు. తైవాన్ అధికారులు మరియు చైనాతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న దేశాల మధ్య అన్ని రకాల అధికారిక పరస్పర చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!