Australia: చైనా అతిపెద్ద సైన్యాన్ని నిర్మిస్తోంది.. ఆస్ట్రేలియన్ రాయబారి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia: రెండో ప్రపంచ యుద్దం తరువాత చైనా అతిపెద్ద సాంప్రదాయిక సైనిక సమీకరణను ఏర్పాటు చేస్తోందని ఆస్ట్రేలియన్ రాయబారి మంగళవారం అన్నారు. అయితే ఈ సైనికీకరణ వ్యూహాత్మక ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయడకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్లిష్టకాలంలో చైనాతో ఆస్ట్రేలియా సంబంధాన్ని స్థిరీకరించకోవడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.
భారతదేశంలో ఆస్ట్రేలియన్ హైకమిషన్ గా ఉన్న ఫిలిప్ గ్రీన్ కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. స్పష్టంగా చెప్పాలంటే చైనాతో మాకున్న ఉత్పాదక కార్యకలాపాలకు ఆస్ట్రేలియా ప్రాధాన్యత ఇస్తోందని, క్లిష్టకాలంలో మా సంబంధాలను స్థిరీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యయాని అన్నారు.
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
Read Also: Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు హైదరాబాద్ లో వైన్స్ బంద్
ఇండియాస్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్తో కలిసి ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ‘‘కోల్కతా డైలాగ్ – ఆస్ట్రేలియా అండ్ ఇండియా: వర్కింగ్ టుగెదర్ టు బిల్డ్ ఐలాండ్ స్టేట్ రెసిలెన్స్’’ కార్యక్రమంలో మిస్టర్ గ్రీన్ కోల్కతాలో ప్రసంగించారు. రెండు రోజుల 13వ ఇండో-పసిఫిక్ ఆర్మీ చీఫ్స్ కాన్ఫరెన్స్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభమైన సందర్భంగా కోల్కతా డైలాగ్ జరుగుతోంది. ఇండో-పసిఫిక్ ద్వీప దేశాల్లో క్లైమెట్ రిసిలెన్స్ నిర్మించడంతో పాటు ఈ ప్రాంతంలో బలవంతపు ఆర్థిక కార్యకలాపాలను అడ్డుకోవడం, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం వంటి విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ముఖ్యంగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా, ఆస్ట్రేలియాలకు ఇంట్రెస్ట్ ఉంది. ఇదే ఈ రెండు దేశాల మధ్య వివాదాలకు కారణమవుతోంది. పసిఫిక్ ప్రాంతంతో చైనాకు అడ్డుకట్ట వేయడానికి భారత్-అమెరికా-జపాన్-ఆస్ట్రేలియా దేశాలు ‘క్వాడ్’ పేరుతో కూటమిని కట్టాయి. దక్షిణ చైనా సముద్రం ప్రాంతంలో తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా మరియు వియత్నాం దేశాలో చైనా వివాదం సృష్టిస్తోంది. సముద్రంలో కృత్రిమ ద్వీపాలను ఏర్పాటు చేసి ఆ దేశాలను ఇబ్బందులకు గురి చేస్తోంది.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!