China: స్పేస్ వార్కు చైనా సై.. ఉపగ్రహాలను సైతం బూడిద చేసే ‘సరికొత్త ఆయుధం’ సిద్ధం! ఎలా పని చేస్తుందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: అంతరిక్షంలో అగ్రరాజ్యం అమెరికాకు గట్టి పోటీ ఇస్తున్న చైనా, తాజాగా ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా ఒక సంచలన ఆయుధాన్ని ఆవిష్కరించింది. భవిష్యత్తులో జరగబోయే అంతరిక్ష ఆధారిత (Space-based) యుద్ధాల స్వరూపాన్ని మార్చేసే అత్యంత శక్తివంతమైన సరికొత్త ‘హై-పవర్ మైక్రోవేవ్’ (HPM) ఆయుధాన్ని చైనా రక్షణ శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధి చేశారు. ఈ వినాశకర ఆయుధం ఏకంగా 100 గిగావాట్ల (GW) వరకు మైక్రోవేవ్ శక్తిని ఉత్పత్తి చేయగలదని నిపుణులు వెల్లడించారు. చైనాలోని ప్రఖ్యాత ‘నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ’ (NUDT) శాస్త్రవేత్తలు విడుదల చేసిన ఒక పరిశోధనా పత్రంలో ఈ మైండ్ బ్లాగింగ్ వివరాలు వెల్లడయ్యాయి. చైనా సైన్యం (PLA) తన రహస్య హై-పవర్ మైక్రోవేవ్ ఆయుధ కార్యక్రమానికి సంబంధించిన ఇంతటి వివరణాత్మక సమాచారాన్ని బహిరంగంగా పంచుకోవడం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి.
ఎలాన్ మస్క్ ‘స్టార్లింక్’ లక్ష్యంగా డ్రాగన్ బ్రహ్మాస్త్రం
సాధారణంగా కేవలం 1 గిగావాట్ (GW) మైక్రోవేవ్ పల్స్ దాడి జరిగితేనే అంతరిక్షంలోని ఉపగ్రహాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలు పూర్తిగా మొద్దుబారిపోతాయి. అలాంటిది ఇప్పుడు చైనా రెడీ చేసిన 100 గిగావాట్ల సామర్థ్యం గల ఈ వ్యవస్థ ఎంతటి తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తుందో ఊహించుకోవచ్చు. ఈ సాంకేతికతను ఉపగ్రహ వ్యతిరేక ఆయుధంగా ఉపయోగిస్తే.. భూమికి సమీప కక్ష్యలో (LEO) తిరుగుతున్న ఎలాన్ మస్క్కు చెందిన అత్యంత ఖరీదైన ‘స్టార్లింక్’ (Starlink) వంటి శాటిలైట్ నెట్వర్క్లను ఇవి క్షణాల్లో బూడిద చేయగలవని అంతర్జాతీయ రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
మైనస్ 40 డిగ్రీల్లోనూ పనిచేసే హైబ్రిడ్ వ్యవస్థ
ఇప్పటికే చైనా సైన్యం అనేక గిగావాట్ల పరిధి గల మైక్రోవేవ్ ఆయుధాలను అభివృద్ధి చేసి తమ సైన్యానికి కూడా అందజేసింది. అయితే ఈ కొత్త 100 GW వ్యవస్థ కోసం చైనా శాస్త్రవేత్తలు సరికొత్త ‘లిథియం-అయాన్ కెపాసిటర్ హైబ్రిడ్ వ్యవస్థ’ను రూపొందించారు. ఇది మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ అత్యంత శీతల ఉష్ణోగ్రతలలో సైతం తక్షణమే యాక్టివేట్ అయి, నిరంతరాయంగా విద్యుత్ తరంగాలను విడుదల చేయగలదు. దీనివల్ల మంచుతో కూడిన ధ్రువ ప్రాంతాలలో కూడా చైనా సైన్యం ఎలక్ట్రానిక్ యుద్ధాన్ని సులభంగా విజయం సాధించగలదు. గత కొన్నేళ్లుగా పల్స్డ్-పవర్ టెక్నాలజీలో చైనా ఊహించని వేగంతో దూసుకుపోతోందని, ప్రస్తుతం ఈ రంగంలో డ్రాగన్ కంట్రీ ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరిందని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ మైక్రోవేవ్ వెపన్స్ను మరింత చిన్నవిగా, చౌకగా మార్చి యుద్ధ విమానాలు, షిప్పులపై మోహరించేలా చైనా వ్యూహాలు రచిస్తోందని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజావార్తలు
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!