China: స్పేస్ వార్కు చైనా సై.. ఉపగ్రహాలను సైతం బూడిద చేసే ‘సరికొత్త ఆయుధం’ సిద్ధం! ఎలా పని చేస్తుందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: అంతరిక్షంలో అగ్రరాజ్యం అమెరికాకు గట్టి పోటీ ఇస్తున్న చైనా, తాజాగా ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా ఒక సంచలన ఆయుధాన్ని ఆవిష్కరించింది. భవిష్యత్తులో జరగబోయే అంతరిక్ష ఆధారిత (Space-based) యుద్ధాల స్వరూపాన్ని మార్చేసే అత్యంత శక్తివంతమైన సరికొత్త ‘హై-పవర్ మైక్రోవేవ్’ (HPM) ఆయుధాన్ని చైనా రక్షణ శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధి చేశారు. ఈ వినాశకర ఆయుధం ఏకంగా 100 గిగావాట్ల (GW) వరకు మైక్రోవేవ్ శక్తిని ఉత్పత్తి చేయగలదని నిపుణులు వెల్లడించారు. చైనాలోని ప్రఖ్యాత ‘నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ’ (NUDT) శాస్త్రవేత్తలు విడుదల చేసిన ఒక పరిశోధనా పత్రంలో ఈ మైండ్ బ్లాగింగ్ వివరాలు వెల్లడయ్యాయి. చైనా సైన్యం (PLA) తన రహస్య హై-పవర్ మైక్రోవేవ్ ఆయుధ కార్యక్రమానికి సంబంధించిన ఇంతటి వివరణాత్మక సమాచారాన్ని బహిరంగంగా పంచుకోవడం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి.
ఎలాన్ మస్క్ ‘స్టార్లింక్’ లక్ష్యంగా డ్రాగన్ బ్రహ్మాస్త్రం
సాధారణంగా కేవలం 1 గిగావాట్ (GW) మైక్రోవేవ్ పల్స్ దాడి జరిగితేనే అంతరిక్షంలోని ఉపగ్రహాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలు పూర్తిగా మొద్దుబారిపోతాయి. అలాంటిది ఇప్పుడు చైనా రెడీ చేసిన 100 గిగావాట్ల సామర్థ్యం గల ఈ వ్యవస్థ ఎంతటి తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తుందో ఊహించుకోవచ్చు. ఈ సాంకేతికతను ఉపగ్రహ వ్యతిరేక ఆయుధంగా ఉపయోగిస్తే.. భూమికి సమీప కక్ష్యలో (LEO) తిరుగుతున్న ఎలాన్ మస్క్కు చెందిన అత్యంత ఖరీదైన ‘స్టార్లింక్’ (Starlink) వంటి శాటిలైట్ నెట్వర్క్లను ఇవి క్షణాల్లో బూడిద చేయగలవని అంతర్జాతీయ రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
- Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
- Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!
మైనస్ 40 డిగ్రీల్లోనూ పనిచేసే హైబ్రిడ్ వ్యవస్థ
ఇప్పటికే చైనా సైన్యం అనేక గిగావాట్ల పరిధి గల మైక్రోవేవ్ ఆయుధాలను అభివృద్ధి చేసి తమ సైన్యానికి కూడా అందజేసింది. అయితే ఈ కొత్త 100 GW వ్యవస్థ కోసం చైనా శాస్త్రవేత్తలు సరికొత్త ‘లిథియం-అయాన్ కెపాసిటర్ హైబ్రిడ్ వ్యవస్థ’ను రూపొందించారు. ఇది మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ అత్యంత శీతల ఉష్ణోగ్రతలలో సైతం తక్షణమే యాక్టివేట్ అయి, నిరంతరాయంగా విద్యుత్ తరంగాలను విడుదల చేయగలదు. దీనివల్ల మంచుతో కూడిన ధ్రువ ప్రాంతాలలో కూడా చైనా సైన్యం ఎలక్ట్రానిక్ యుద్ధాన్ని సులభంగా విజయం సాధించగలదు. గత కొన్నేళ్లుగా పల్స్డ్-పవర్ టెక్నాలజీలో చైనా ఊహించని వేగంతో దూసుకుపోతోందని, ప్రస్తుతం ఈ రంగంలో డ్రాగన్ కంట్రీ ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరిందని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ మైక్రోవేవ్ వెపన్స్ను మరింత చిన్నవిగా, చౌకగా మార్చి యుద్ధ విమానాలు, షిప్పులపై మోహరించేలా చైనా వ్యూహాలు రచిస్తోందని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజావార్తలు
-
China: స్పేస్ వార్కు చైనా సై.. ఉపగ్రహాలను సైతం బూడిద చేసే ‘సరికొత్త ఆయుధం’ సిద్ధం! ఎలా పని చేస్తుందంటే..
-
Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్పై వేటు?
-
Ketan Murder Case: కేతన్ను చంపింది సియానే.. కానీ కోర్టులో నిరూపించడమే అసలు సవాల్!
ట్రెండింగ్
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!