China: జిన్పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక ‘అసలు’ మిస్టరీ ఇదేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా మాజీ రక్షణ మంత్రులకు విధించిన మరణశిక్ష ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. కేవలం అవినీతి వల్లే వారికి ఈ శిక్ష పడిందని భావించినా, ఇప్పుడు వెలుగులోకి వస్తున్న తాజా విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. చైనా మాజీ రక్షణ మంత్రులు వేయ్ ఫెంఘే, లీ షాంగ్ఫూలకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించిన 24 గంటలకే ఒక విస్తుపోయే నిజం బయటపడింది. వీరిద్దరిపై కేవలం అవినీతి ఆరోపణలే కాకుండా, దేశం పట్ల.. ముఖ్యంగా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పట్ల ‘అపనమ్మకం’, ‘నమ్మకద్రోహం’ చేసినట్లు అధికారికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అవినీతి కాదు.. అంతకు మించి..
తొలుత వీరిద్దరినీ అవినీతి ఆరోపణలపై పదవుల నుంచి తొలగించినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా చైనా ప్రభుత్వ పత్రిక ‘పీఎల్ఏ డైలీ’ ప్రచురించిన ఒక వ్యాసం ఇప్పుడు చర్చనీయాంశమైంది. “సైన్యంలోని అగ్రశ్రేణి అధికారులు ఎవరైనా నమ్మకద్రోహానికి తలపడితే వారి గతి ఏమవుతుందో ఈ తీర్పు రుజువు చేసింది” అని ఆ పత్రిక పేర్కొంది. వీరు తమ లక్ష్యాలను విస్మరించి, పార్టీ సూత్రాలను కాలరాశారని చైనా సైనిక విభాగం ఘాటుగా విమర్శించింది.
Also Read
- Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
2023లో ఏం జరిగిందంటే..
వేయ్ ఫెంఘే 2018 నుంచి 2023 వరకు రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆయన తర్వాత లీ షాంగ్ఫూ ఆ పీఠం ఎక్కారు. కానీ కొన్ని నెలలకే ఆయన అదృశ్యం కావడం, తర్వాత పదవి నుంచి తొలగించడం జరిగిపోయాయి.
వీరిద్దరినీ శిక్షించడం వెనుక అసలు కారణం 2023లో షీ జిన్పింగ్కు వ్యతిరేకంగా సాగిన కుట్ర అని విశ్లేషకులు భావిస్తున్నారు. పీఎల్ఏ డైలీ వాడిన ‘విశ్వాసఘాతుకం’ (Zhongcheng Shijie) అనే పదం సాధారణంగా రాజకీయ తిరుగుబాటు చేసే వారిపైనే చైనా ప్రయోగిస్తుంది. ఆయుధాలు పట్టుకున్న వారు మొట్టమొదట వఫాదార్లుగా (నమ్మకస్తులు) ఉండాలి అని చైనా సర్కారు స్పష్టం చేసింది. సీనియర్ నాయకులు తన పట్ల విధేయతను కోల్పోతే సహించేది లేదని జిన్పింగ్ ఈ మరణశిక్షల ద్వారా సైన్యానికి గట్టి సందేశాన్ని పంపారు. చైనా చరిత్రలో ఇంతటి ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులకు మరణశిక్ష విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ పరిణామం చైనా కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గతంగా ఉన్న అశాంతిని, జిన్పింగ్ తన అధికారాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న కఠిన చర్యలను ప్రతిబింబిస్తోంది.
తాజావార్తలు
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!