China Interest Rates: చైనాలో రియల్ సంక్షోభం.. వడ్డీ రేట్ల తగ్గింపు
ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది? చైనా ఏం చేయబోతోంది? రియల్ ఎస్టేట్ రంగంలో ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చైనా ఏం చేయబోతోంది? అనేవి కీలకంగా మారాయి. విశ్వవ్యాప్తంగా ఆర్థిక మందగమన భయాలు అలుముకుంటున్న వేళ చైనా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రపంచంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులన్నీ కీలక వడ్డీ రేట్లను పెంచుతుండగా చైనా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. అక్కడ వడ్డీరేట్లు తగ్గిస్తోంది. వడ్డీరేట్ల తగ్గింపుతో సంక్షోభంలో కూరుకుపోయిన స్థిరాస్తి రంగానికి చైనా ఊతమిస్తోంది. రెండో దశ కొవిడ్ విజృంభణతో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోంది. చైనా నిర్ఱయాలు భారత్ కు అనుకూలంగా మారతాయని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు.. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు
Also Read
- Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
- Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
- EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
కరోనాకారణంగా అన్నిచోట్ల వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. అయితే, ఆరోగ్యరంగానికి సంబంధించిన ఫార్మా రంగం మాత్రమే వృద్ధిని నమోదుచేసింది. చైనాలో కొనుగోళ్లు నిలిచిపోయి ఆ దేశ రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోతోంది. అక్కడ చాలా దిగ్గజ సంస్థలు దివాళా తీశాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థలోని నగదును చలామణిలోకి తీసుకురావడం కోసం కీలక నిర్ణయాలకు తెరతీసింది చైనా.. రుణాలపై వడ్డీరేట్లు తగించడం ద్వారా అక్కడ ద్రవ్య లభ్యత అధికమవుతుందని చైనా భావిస్తోంది.
చైనాలో స్థిరాస్తి సంక్షోభం సుదీర్ఘంగా కొనసాగితే.. అక్కడి నుంచి విదేశీ పెట్టుబడులు.. భారత్ వంటి వర్ధమాన దేశాలకు తరలే అవకాశం ఉంది. కొత్తగా ఎలాంటి పెట్టుబడులు చైనాకు వెళ్ళవంటున్నారు. మెరుగైన వృద్ధి రేటు సాధిస్తున్న భారత్లోకి చైనాకు వెళ్లాల్సిన పెట్టుబడులన్నీ తరలి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ లో రేట్లు పెరిగినా.. ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి కనిపిస్తోంది. రానున్న రోజుల్లో విదేశీ పెట్టుబడులు పుంజుకుంటే మార్కెట్లకు మరింత దన్ను లభిస్తుందని నిపుణులు అంటున్నారు.
చైనా కేంద్ర బ్యాంక్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పీబీసీ) వడ్డీరేట్లు తగ్గించింది. ఏడాది కాలపరిమితిలోపు ఉండే రుణాలపై కనీస వడ్డీ రేటును 2.85 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గించింది. దీనికి తోడుగా రుణ పరపతి పెంచేందుకు బ్యాంకులకు అదనంగా 6,000 కోట్ల డాలర్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది చైనా జీడీపీ వృద్ధి రేటు 2.5 శాతం మించలేదు. వృద్ధి రేటు ఇలానే కొనసాగితే ఈ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్న 5.5 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధించడం అసాధ్యం అంటున్నారు. అందుకే వడ్డీరేట్లు తగ్గింపు ఉద్దీపనలకు దిగింది.
తాజావార్తలు
-
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!