Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. “జాఫర్ ఎక్స్ప్రెస్”నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో మరోసారి ‘‘జాఫర్ ఎక్స్ప్రెస్’’పై బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతున్న ‘‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ దాడికి పాల్పడింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పాక్ ఆర్మీ సైనికులతో వెళ్తున్న ఈ రైలును బీఎల్ఏ లక్ష్యంగా చేసుకుని, ఒక సిగ్నల్ క్రాసింగ్ వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో 24 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో పెషావల్ వెళ్తున్న అనేక మంది సైనికులు, ఈద్ కోసం వెళ్తున్న వారు ఉన్నారు. బీఎల్ఏ ఆత్మాహుతి దళం మజీద్ బ్రిగేడ్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటన విడుదల చేసింది.
జాఫర్ ఎక్స్ప్రెస్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.?
Also Read
పాకిస్తాన్ లోని క్వెట్టా నుంచి పెషావర్కు ప్రయాణించే జాఫర్ ఎక్స్ప్రెస్ కీలక పట్టణాల నుంచి వెళ్తుంది. జకోబాబాద్, సుక్కూర్, రహీంయార్ ఖాన్, బహవల్పూర్, ముల్తాన్, లాహోర్, గుజ్రాన్వాలా, రావల్పిండి మీదుగా పెషావర్ వెళ్తుంది. పాకిస్తాన్లో ప్రధాన నగరాలను పట్టణాల గుండా వెళ్తుంది. ముఖ్యంగా కల్లోలిత, తిరుగుబాటు కలిగిన బలూచిస్తాన్లో పనిచేసేందుకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ, పాక్ ఆర్మీ అధికారులు ప్రయాణించేందుకు ఈ రైలునే ఉపయోగిస్తారు. అందుకే ఈ ట్రైన్ టార్గెట్ అవుతుంది.
ముఖ్యంగా బలూచిస్తాన్ నుంచి పంజాబ్ వెళ్లేవారు చాలా మంది ఈ ట్రైన్లో ఉంటారు. పాక్ ఆర్మీలో పంజాబీలే అధికారం, వీరినే బీఎల్ఏ టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా ఈద్ సమయాల్లో తమ కుటుంబాలతో గడిపేందుకు పాక్ భద్రతాధికారులు ఈ ట్రైన్లో ప్రయాణిస్తుంటారు.
హైజాక్, వరస దాడులు:
ట్రైన్ హైజాక్ చేయడం చాలా అరుదుగా వింటుంటాం. 2025లో బీఎల్ఏ ఫైటర్స్ ఏకంగా జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేశారు. బలూచిస్తాన్లో మారుమూల సిబీ రైల్వే స్టేషన్కు సమీపంలో దాడి చేసి రైలును నిలిపేశారు. బీఏల్ఏ ఏకంగా 450 మంది ప్రయాణికుల్ని బందీలుగా చేసుకుంది. .ఈ ఘటనలో దాదాపుగా 150 మందికి పైగా పాకిస్తాన్ సైనికుల్ని బీఎల్ఏ ఊచకోత కోసింది. పాక్ జైళ్లలో ఉన్న బీఎల్ఏ సభ్యుల్ని విడిపించాలనే షరతుకు పాక్ అంగీకరించలేదు. దీంతో పాక్ సైనికుల్ని హతమార్చింది.
నిజానికి 2024 నవంబర్ నెలలో క్వెట్టా రైల్వే స్టేషన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. పాక్ ఆర్మీ జవాన్లను టార్గెట్ చేస్తూ ఈ దాడిని బీఎల్ఏ నిర్వహించింది. ఈ ఘటనలో 60 మంది మరణించారు. అప్పటి నుంచి క్వెట్టా-పెషావర్ మధ్య రైలుని రద్దు చేశారు. మళ్లీ సర్వీస్ని పునరుద్ధరించారు. ప్రారంభించిన కొన్ని రోజులకే ట్రైన్ హైజాక్కి గురైంది. ఇదే కాకుండా చాలా సార్లు జాఫర్ ఎక్స్ప్రెస్ టార్గెట్గా పట్టాలపై బాంబులు పెట్టి నిలిపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
Gulveer Singh History: గుల్వీర్ సింగ్ నయా చరిత్ర.. తొలి భారత అథ్లెట్గా!
-
Huawei MatePad 11.5 2026: హువావే మేట్ప్యాడ్ 11.5 భారత్లో లాంచ్.. 10,100mAh బ్యాటరీ, 120Hz పేపర్మ్యాట్ డిస్ప్లే
-
Tilak Varma: స్టార్ బాయ్కి ప్రమోషన్.. సౌత్ జోన్ కెప్టెన్గా ఛాన్స్.!
-
Trump: ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్పై కొత్త దాడులకు బ్రేక్..
-
Ghattamaneni Aadiseshagirirao : పద్మాలయ స్టూడియోస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే భాద్యత జై కృష్ణపై ఉంది
ట్రెండింగ్
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!