Pakistan: పాక్లో వరస దాడులు.. బలూచిస్తాన్లో ఆర్మీ కన్వాయ్పై ఎటాక్..
- పాకిస్తాన్ని వణికిస్తున్న వరస దాడులు..
- 24 గంటల్లో బలూచిస్తాన్లో రెండో ఎటాక్..
- ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా శక్తివంతమైన పేలుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో మరోసారి దాడి జరిగింది. ఇప్పటికే జఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటనలో పాకిస్తాన్ తన పరువును కోల్పోయింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ వణికిపోతోంది. ఇదిలా ఉంటే, తాజాగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) మార్గంలో పాకిస్తాన్ బలగాలకు చెందిన కాన్వాయ్ లక్ష్యంగా శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం, బహుళ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. అయితే, అక్కడి అధికారులు మాత్రం వివరాలను విడుదల చేయలేదు.
Read Also: Ambati Rambabu: చిరంజీవి తమ్ముడు కాకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?
Also Read
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
బలూచిస్తాన్లో పాకిస్తాన్ దళాలపై 24 గంటల్లో ఇది రెండో దాడి. ఒక రోజు ముందు, హర్నైలో బాంబు డిఫ్యూజ్ స్వ్కాడ్ రైల్వే ట్రాక్ని క్లియర్ చేస్తున్న సమయంలో బాంబు దాడి జరిగింది. ఈ వారం ప్రారంభంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ రైలుని బోలాన్ ప్రాంతంలో హైజాక్ చేసింది. ఈ ఘటనలో 200 మంది పాకిస్థానీ సైనికులు, ఐఎస్ఐ సిబ్బందిని పట్టుకుంది. తమకు చెందిన ఖైదీలను పాక్ ప్రభుత్వం విడుదల చేయాలని, లేకపోతే అందర్ని చంపేస్తామని అల్టిమేటం విధించింది.
ఖైదీల విడుదల గడువు ముగియడంతో, తమ బందీలుగా ఉన్న 214 మందిని చంపేశామని బీఎల్ఏ ప్రతినిధి జీయాంద్ బలోచ్ ఒక ప్రకటనలో తెలిపారు. తాము ఇచ్చిన 48 గంటల సమయాన్ని పాకిస్తాన్ పట్టించుకోలేదని చెప్పారు. పాకిస్తాన్ క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి, మెండితనంతో 214 మంది బందీలు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని ప్రకటనలో బీఎల్ఏ పేర్కొంది. అంతకుముందు, పాకిస్తాన్ రైలు హైజాక్ ఘటనను 36 గంటల్లో ముగించామని పాక్ ఆర్మీ వెల్లడించింది. 30 మంది మిలిటెంట్లను చంపేసి, బందీలను రెస్క్యూ చేశామని ప్రకటించింది. అయితే, బీఎల్ఏ ఈ వాదనల్ని తప్పుపట్టింది.
తాజావార్తలు
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!