Pakistan: పాక్లో వరస దాడులు.. బలూచిస్తాన్లో ఆర్మీ కన్వాయ్పై ఎటాక్..
- పాకిస్తాన్ని వణికిస్తున్న వరస దాడులు..
- 24 గంటల్లో బలూచిస్తాన్లో రెండో ఎటాక్..
- ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా శక్తివంతమైన పేలుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో మరోసారి దాడి జరిగింది. ఇప్పటికే జఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటనలో పాకిస్తాన్ తన పరువును కోల్పోయింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ వణికిపోతోంది. ఇదిలా ఉంటే, తాజాగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) మార్గంలో పాకిస్తాన్ బలగాలకు చెందిన కాన్వాయ్ లక్ష్యంగా శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం, బహుళ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. అయితే, అక్కడి అధికారులు మాత్రం వివరాలను విడుదల చేయలేదు.
Read Also: Ambati Rambabu: చిరంజీవి తమ్ముడు కాకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
బలూచిస్తాన్లో పాకిస్తాన్ దళాలపై 24 గంటల్లో ఇది రెండో దాడి. ఒక రోజు ముందు, హర్నైలో బాంబు డిఫ్యూజ్ స్వ్కాడ్ రైల్వే ట్రాక్ని క్లియర్ చేస్తున్న సమయంలో బాంబు దాడి జరిగింది. ఈ వారం ప్రారంభంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ రైలుని బోలాన్ ప్రాంతంలో హైజాక్ చేసింది. ఈ ఘటనలో 200 మంది పాకిస్థానీ సైనికులు, ఐఎస్ఐ సిబ్బందిని పట్టుకుంది. తమకు చెందిన ఖైదీలను పాక్ ప్రభుత్వం విడుదల చేయాలని, లేకపోతే అందర్ని చంపేస్తామని అల్టిమేటం విధించింది.
ఖైదీల విడుదల గడువు ముగియడంతో, తమ బందీలుగా ఉన్న 214 మందిని చంపేశామని బీఎల్ఏ ప్రతినిధి జీయాంద్ బలోచ్ ఒక ప్రకటనలో తెలిపారు. తాము ఇచ్చిన 48 గంటల సమయాన్ని పాకిస్తాన్ పట్టించుకోలేదని చెప్పారు. పాకిస్తాన్ క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి, మెండితనంతో 214 మంది బందీలు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని ప్రకటనలో బీఎల్ఏ పేర్కొంది. అంతకుముందు, పాకిస్తాన్ రైలు హైజాక్ ఘటనను 36 గంటల్లో ముగించామని పాక్ ఆర్మీ వెల్లడించింది. 30 మంది మిలిటెంట్లను చంపేసి, బందీలను రెస్క్యూ చేశామని ప్రకటించింది. అయితే, బీఎల్ఏ ఈ వాదనల్ని తప్పుపట్టింది.
తాజావార్తలు
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..