భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను దేశంలో వేగంగా అమలుచేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ను ఇప్పటికే అనేక దేశాలకు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, బ్రెజిల్ 2 కోట్ల వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చి, క్యాన్సిల్ చేసుకున్నది. ఈ డీల్ విలువ 324 మిలియన్ డాలర్లు. అయితే, వ్యాక్సిన్కు బ్రెజిల్లో అనుమతులు లేకపోవడం, బ్రెజిల్ అధ్యక్షుడిపై ఒత్తిడి రావడంతో ఈ డీల్ను క్యాన్సిల్ చేసుకోవడంపై కోవాగ్జిన్ వివరణ ఇచ్చింది. అన్నిదేశాలతో ఒప్పందం మాదిరిగానే బ్రెజిల్ ఒప్పందం కూడా జరిగిందని, ఇందులో తమ తప్పేమీలేదని భారత్ బయోటెక్ సంస్థ వివరణ ఇచ్చింది. బ్రెజిల్ నుంచి తమకు ఎలాంటి అడ్వాంసులు వంటికి జరగలేదని ఆ సంస్థ తెలియజేసింది.
బ్రెజిల్ డీల్ పై కోవాగ్జిన్ వివరణ…
