Bat Virus: గబ్బిలాల్లో ప్రాణాంతక వైరస్ని పరిశోధనా బృందం థాయ్లాండ్లో కనుగొంది. గతంలో కరోనా వైరస్తో ముడిపడి ఉన్న ఎకోహెల్త్ అలయన్స్ పరిశోధకులే ఈ డెడ్లీ బ్యాట్ వైరస్ని కనుగొన్నారు. ఈ సంస్థ చీఫ్ డాక్టర్ పీటర్ దస్జాక్ కోవిడ్ లాగే మానవులకు సోకే అవకాశం ఉన్న వైరస్ని కనుగొన్నట్లు డైలీ మెయిల్ నివేదించింది. గతంలో ఈ పరిశోధర బృందానికి చైనా వూహాన్ వివాదాస్పద ప్రయోగశాలతో సంబంధం ఉంది. థాయ్లాండ్ లోని ఓ గుహలోని గబ్బిలాల్లో ఈ వైరస్ కనుగొనబడింది. ఇప్పటికే పరిశోధకులు కనుగొన్న చాలా SARS వైరస్లకు కరోనా వైరస్లతో సంబంధం ఉందని తేలింది.
Read Also: Himanta Biswa Sarma: కాంగ్రెస్కి బాబర్ అంటేనే ప్రేమ.. రాముడిపై కాదు..
ఇక్కడ స్థానిక రైతులు తమ పొలాల్లో ఎరువుగా వేయడానికి గబ్బిలాల మలాన్ని సేకరిస్తున్నారు. కొత్తగా కనుగొనబడిన వైరస్ కోవిడ్-19కి దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఇది కూడా కోవిడ్ లాగే మానవులకు సోకే సామర్థ్యాన్ని కలిగి ఉందని పరిశోధకలు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఈ వైరస్కి ఎలాంటి పేరు పెట్టలేదు. గబ్బిలాల మలంలో కూడా ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఇది ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా కేసులు పెరుగుతున్నాయని, 50 దేశాల్లో 40 శాతం కేసుల సంఖ్య పెరిగినట్లు ప్రకటించిన కొన్ని రోజులకే ఈ పరిశోధన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.
గతంలో వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటకు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019లో చైనాలో బయటపడిన కరోనా వైరస్ ఇప్పటికీ కూడా ప్రపంచాన్ని కలవరపెడుతోంది. మరోవైపు కొత్త కోవిడ్ వేరియంట్ JN.1 కలవరపరుస్తోంది. ఈ వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. భారత్లో కూడా ఈ వేరియంట్ కారణంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది.
