Pakistan: పాకిస్తాన్కి ‘‘జాక్పాట్’’ తగిలింది.. సింధునదిలో భారీగా బంగారు నిల్వలు..
- ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కి జాక్పాట్ తగిలింది..
- సింధు నదిలో భారీగా బంగారు నిల్వలు..
- హిమాలయాల నుంచి మోసుకొచ్చిన నదీ ప్రవాహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆర్థిక సంక్షోభం, అప్పులు, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కి జాక్పాట్ తగిలింది. సింధునదిలో ‘‘బంగారు నిల్వలు’’ ఉన్నట్లు తేలింది. ప్రాచీన సింధు లోయ నాగరికతకు ఈ నది తల్లిగా ఉంది. అద్భుతమైన నాగరికత ఈ నదీ ఒడ్డునే వెలిసింది. మెహంజోదారో, హరప్పా వంటి గొప్ప నగరాలు ఈ నాగరికతలో వెలిశాయి. ఋగ్వేదంలో కూడా సింధు నదీ ప్రస్తావన ఉంది. క్రీస్తుపూర్వం 3300-1300 మధ్య హరప్పా నాగరికతకు కీలకంగా సింధునది ఉంది.
ఇలాంటి పురాతన నది ఇప్పుడు పాకిస్తాన్ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. సింధు నదిలో భారీగా బంగారు నిల్వలు ఉన్నట్లు తేలింది. ఈ నదిలో 600 బిలియన్ పాకిస్తానీ రూపాయల విలువైన సంపద ఉందని అక్కడి మీడియా నివేదించింది. హిమాలయాల నుంచి పుట్టే సింధు నది పాకిస్తాన్లో ఎక్కువగా ప్రవహిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులో, అటాక్ జిల్లాలో గణనీయమైన మొత్తంలో బంగారం, ఇతర ఖనిజాలు ఉన్నాయని తెలుస్తోంది. బంగారు నిక్షేపాలు 32.6 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని పేర్కొన్నారు. 600 బిలియన్ పాకిస్తాన్ రూపాయల విలువైన ఈ బంగారం అటాక్లోని 32 కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉందని పంజాబ్ మైనింగ్ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ వెల్లడించారు.
Also Read
- Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
- FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
- US - Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- JD Vance Fourth Child: నాలుగోసారి తండ్రైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. 150 ఏళ్ల అమెరికా చరిత్రలో అరుదైన ఘట్టం
Read Also: Fun Bucket Bhargav: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు.. ఫన్ బకెట్ భార్గవ్కు 20 ఏళ్ల శిక్ష
పాకిస్తానీ మీడియా నివేదిక ప్రకారం… సింధు నదిలో లభించే బంగారం పాకిస్తాన్ ఉత్తర పర్వత ప్రాంతాల నుంచి వేగంగా ప్రవహించే నదిలోకి వస్తున్నట్లు, ఇది నదీ గర్భంలో సెటిల్ అవతున్నట్లు చెబుతోంది. 3200 కి.మీ విస్తరించి ఉన్న సింధు నది ప్రపంచంలో అతిపెద్ద నదుల్లో ఒకటి. బంగారం కలిగి ఉన్న సింధు నదిలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తూ సెక్షన్ 144 అమలు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. బంగారం వంటి విలువైన ఖనిజాలు దేశ ఖజానాకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని పంజాబ్ ప్రావిన్స్ హోంశాఖ చెప్పింది.
శీతాకాలంలో, సింధు నదిలో నీటిమట్టం తగ్గుతున్నందున స్థానికులు నదీ గర్భం నుంచి అక్రంగా బంగారు కణాలను సేకరిస్తారనే భయం అక్కడి ప్రభుత్వంలో ఉంది. పాక్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే నివేదిక ప్రకారం.. హిమాలయ ప్రాంతం నుంచి బంగారం వస్తోందని, షెషావర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరుకుపోతుందని తెలిపింది. 6-10 మిలియన్ ఏళ్ల క్రితం రెండు టెక్టానిక్ ప్లేట్లు ఢీకొన్న తర్వాత హిమాలయాలు, సింధు నది ఉద్భవించాయి. నీటి ప్రవాహం కారణంగా హిమాలయాల నుంచి బంగారు కణాలు నదిలోకి చేరినట్లు తెలుస్తోంది. ఇలా జరిగే దృగ్విషయాన్ని ‘‘ప్లేసర్ డిపాజిట్స్’’గా పిలుస్తారు.
తాజావార్తలు
-
Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!