Bangladesh: బంగ్లాదేశ్లో ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్పీ ప్రభుత్వానికి స్టూడెంట్ పార్టీ వార్నింగ్ ఇస్తోంది. తమను రెచ్చొగొట్టవద్దని, హింసలో మమ్మల్ని ఎవరూ మించలేరని హెచ్చరిస్తున్నారు. మీకు కూడా షేక్ హసీనాకు పట్టిన గతే పడుతుందని చెబుతున్నారు. స్టూడెంట్ పార్టీగా ఉన్న ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ అధికార ప్రతినిధి ఆసిఫ్ మహమూద్ షోజిబ్ భూయాన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం హింసనే రాజకీయ ఆయుధంగా ఉపయోగించాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఉటాయని, హింసలో మమ్మల్ని ఎవరూ మించలేరని అన్నారు. ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్లో సంచలనంగా మారాయి. మరోసారి షేక్ హసీనా సమయంలోని ఉద్యమం జరుగుతుందా అనే ప్రశ్నలు నెలకొన్నాయి.
అధికార బీఎన్పీ, నేషనల్ సిటిజన్ పార్టీకి మధ్య జరిగిన ఘర్షణ తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఝెనైదాలో పట్టణంలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ‘‘మీరు మాపై దీనిని రుద్దాలని అనుకుంటే, ఈ పోరాటం ఏ ఒక్క రాజకీయ పార్టీకి, నిర్దిష్ట భావజాలం, సిద్ధంతానికి వ్యతిరేకంగా జరగదు. ఈ పోరాటం మొత్తం ఒక జనరేషన్కు వ్యతిరేకంగా సాగుతుంది. షేక్ హసీనా ఈ తరంతో పోరాడి తప్పు చేశారు. తారిఖ్ రెహమాన్ కూడా ఈ తప్పును మళ్లీ చేయొద్దు’’ అని హెచ్చరించారు.
