Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- గంగా నదిపైనే భారత్ సంబంధాలు ఆధారపడుతాయి..
- బంగ్లాదేశ్ అధికార పార్టీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: భారత్తో బంగ్లాదేశ్ సంబంధాలు ఇప్పట్లో మెరుగయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేకతను పెంచిపోషించింది. ఇప్పుడు, ప్రధాని తారిఖ్ రెహ్మన్ నేతృత్వంలోని బీఎన్పీ ప్రభుత్వం కూడా వివాదాలను మరింత పెంచేలా వ్యాఖ్యలు చేస్తోంది. భారత్తో భవిష్యత్ సంబంధాలు ‘‘గంగా జలాల పంపిణీ ఒప్పందం’’పై ఆధారపడుతాయని బీఎన్పీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ఇండో-బంగ్లాదేశ్ గంగా జలాల ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్తో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఒప్పందంపై వెంటనే చర్చలు ప్రారంభించాలని బంగ్లాదేశ్ భారత్ను కోరింది.
బంగ్లాదేశ్ గ్రామీణాభివృద్ధి, సహకార శాఖ మంత్రి, బీఎన్పీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలమ్గీర్ మాట్లాడుతూ..బంగ్లాదేశ్ ప్రజల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త గంగా జలాల ఒప్పందం కుదిరితే భారత్తో మంచి సంబంధాలు కొనసాగుతాయని అన్నారు. 1996లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కాలంలో కుదిరిన ఒప్పందం 2026తో ముగుస్తోంది.
Also Read
భారత్ నుంచి బంగ్లాదేశ్కు వెళ్లే గంగా నది( బంగ్లాదేశ్లో పద్మా నదిగా పిలుస్తారు), ఆ దేశ వ్యవసాయం, తాగునీటి అవసరాలకు కీలకం. ఒక్క గంగా నది మాత్రమే కాకుండా, 50కి పైగా నదులు భారత్ నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఫరక్కా బ్యారేజ్ కీలకంగా మారింది. కోల్కతా పోర్ట్ నావిగేషన్ కోసమే తాము ఫరక్కా డ్యామ్ నిర్మించినట్లు భారత్ చెబుతోంది. ఈ డ్యామ్ వల్ల వేసవి కాలంలో నదీ ప్రవాహం తగ్గి నీరు ఉప్పుగా మారడం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని బంగ్లా ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే, ఫరక్కా ప్రభావాన్ని తగ్గించడానికి పద్మా నదిపై భారీ బ్యారేజ్ నిర్మాణానికి బంగ్లాదేశ్ ఇటీవల ఆమోదం తెలిపింది. 2033 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య తీస్తా నది వివాదం కూడా ఉంది. మమతా బెనర్జీ తీస్తా నది విసయంలో సహకరించలేదని ఇటీవల బీఎన్పీ ఆరోపించింది. తీస్తా ఒప్పదం అమలైతే భారత్-బంగ్లా మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని ఆ పార్టీ చెప్పింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!