Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- గంగా నదిపైనే భారత్ సంబంధాలు ఆధారపడుతాయి..
- బంగ్లాదేశ్ అధికార పార్టీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: భారత్తో బంగ్లాదేశ్ సంబంధాలు ఇప్పట్లో మెరుగయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేకతను పెంచిపోషించింది. ఇప్పుడు, ప్రధాని తారిఖ్ రెహ్మన్ నేతృత్వంలోని బీఎన్పీ ప్రభుత్వం కూడా వివాదాలను మరింత పెంచేలా వ్యాఖ్యలు చేస్తోంది. భారత్తో భవిష్యత్ సంబంధాలు ‘‘గంగా జలాల పంపిణీ ఒప్పందం’’పై ఆధారపడుతాయని బీఎన్పీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ఇండో-బంగ్లాదేశ్ గంగా జలాల ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్తో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఒప్పందంపై వెంటనే చర్చలు ప్రారంభించాలని బంగ్లాదేశ్ భారత్ను కోరింది.
బంగ్లాదేశ్ గ్రామీణాభివృద్ధి, సహకార శాఖ మంత్రి, బీఎన్పీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలమ్గీర్ మాట్లాడుతూ..బంగ్లాదేశ్ ప్రజల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త గంగా జలాల ఒప్పందం కుదిరితే భారత్తో మంచి సంబంధాలు కొనసాగుతాయని అన్నారు. 1996లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కాలంలో కుదిరిన ఒప్పందం 2026తో ముగుస్తోంది.
Also Read
- Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
- WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
భారత్ నుంచి బంగ్లాదేశ్కు వెళ్లే గంగా నది( బంగ్లాదేశ్లో పద్మా నదిగా పిలుస్తారు), ఆ దేశ వ్యవసాయం, తాగునీటి అవసరాలకు కీలకం. ఒక్క గంగా నది మాత్రమే కాకుండా, 50కి పైగా నదులు భారత్ నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఫరక్కా బ్యారేజ్ కీలకంగా మారింది. కోల్కతా పోర్ట్ నావిగేషన్ కోసమే తాము ఫరక్కా డ్యామ్ నిర్మించినట్లు భారత్ చెబుతోంది. ఈ డ్యామ్ వల్ల వేసవి కాలంలో నదీ ప్రవాహం తగ్గి నీరు ఉప్పుగా మారడం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని బంగ్లా ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే, ఫరక్కా ప్రభావాన్ని తగ్గించడానికి పద్మా నదిపై భారీ బ్యారేజ్ నిర్మాణానికి బంగ్లాదేశ్ ఇటీవల ఆమోదం తెలిపింది. 2033 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య తీస్తా నది వివాదం కూడా ఉంది. మమతా బెనర్జీ తీస్తా నది విసయంలో సహకరించలేదని ఇటీవల బీఎన్పీ ఆరోపించింది. తీస్తా ఒప్పదం అమలైతే భారత్-బంగ్లా మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని ఆ పార్టీ చెప్పింది.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..