Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- గంగా నదిపైనే భారత్ సంబంధాలు ఆధారపడుతాయి..
- బంగ్లాదేశ్ అధికార పార్టీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: భారత్తో బంగ్లాదేశ్ సంబంధాలు ఇప్పట్లో మెరుగయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేకతను పెంచిపోషించింది. ఇప్పుడు, ప్రధాని తారిఖ్ రెహ్మన్ నేతృత్వంలోని బీఎన్పీ ప్రభుత్వం కూడా వివాదాలను మరింత పెంచేలా వ్యాఖ్యలు చేస్తోంది. భారత్తో భవిష్యత్ సంబంధాలు ‘‘గంగా జలాల పంపిణీ ఒప్పందం’’పై ఆధారపడుతాయని బీఎన్పీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ఇండో-బంగ్లాదేశ్ గంగా జలాల ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్తో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఒప్పందంపై వెంటనే చర్చలు ప్రారంభించాలని బంగ్లాదేశ్ భారత్ను కోరింది.
బంగ్లాదేశ్ గ్రామీణాభివృద్ధి, సహకార శాఖ మంత్రి, బీఎన్పీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలమ్గీర్ మాట్లాడుతూ..బంగ్లాదేశ్ ప్రజల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త గంగా జలాల ఒప్పందం కుదిరితే భారత్తో మంచి సంబంధాలు కొనసాగుతాయని అన్నారు. 1996లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కాలంలో కుదిరిన ఒప్పందం 2026తో ముగుస్తోంది.
Also Read
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
భారత్ నుంచి బంగ్లాదేశ్కు వెళ్లే గంగా నది( బంగ్లాదేశ్లో పద్మా నదిగా పిలుస్తారు), ఆ దేశ వ్యవసాయం, తాగునీటి అవసరాలకు కీలకం. ఒక్క గంగా నది మాత్రమే కాకుండా, 50కి పైగా నదులు భారత్ నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఫరక్కా బ్యారేజ్ కీలకంగా మారింది. కోల్కతా పోర్ట్ నావిగేషన్ కోసమే తాము ఫరక్కా డ్యామ్ నిర్మించినట్లు భారత్ చెబుతోంది. ఈ డ్యామ్ వల్ల వేసవి కాలంలో నదీ ప్రవాహం తగ్గి నీరు ఉప్పుగా మారడం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని బంగ్లా ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే, ఫరక్కా ప్రభావాన్ని తగ్గించడానికి పద్మా నదిపై భారీ బ్యారేజ్ నిర్మాణానికి బంగ్లాదేశ్ ఇటీవల ఆమోదం తెలిపింది. 2033 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య తీస్తా నది వివాదం కూడా ఉంది. మమతా బెనర్జీ తీస్తా నది విసయంలో సహకరించలేదని ఇటీవల బీఎన్పీ ఆరోపించింది. తీస్తా ఒప్పదం అమలైతే భారత్-బంగ్లా మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని ఆ పార్టీ చెప్పింది.
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!