Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్లో పాకిస్తాన్ మూలాలు బయటపడ్డాయి. నిషేధిత పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP)తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ, బంగ్లాదేశ్లోని పలు వైమానిక స్థావరాలపై ఉన్నతాధికారులు దాడులు చేశారు. ఈ నెట్వర్క్ బయటపడటంతో భారీ ఎత్తున ప్రక్షాళనకు బంగ్లాదేశ్ పూనుకుంది. ఏప్రిల్ 20 తెల్లవారుజామున జరిగిన ఈ ఆపరేషన్లో ఇద్దరు స్వ్కాడ్రన్ లీడర్లు, దాదాపు 10 మంది జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు(JCOలు), వైమానిక సిబ్బంది అరెస్టులు జరిగాయి. మరో 12 మందిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఇంకా చాలా మంది దేశం విడిచిపెట్టి విదేశాలకు వెళ్లిపోయారు.
Read Also: PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
నివేదికల ప్రకారం.. ఏప్రిల్ 20రన ఢాకాలోని రెండు ఎయిర్ బేస్లపై బంగ్లా ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేశారు. చిట్టగాంగ్ లోని జహరుల్ హక్ ఎయిర్ బేస్లో పనిచేస్తున్న వైమానిక దళ వారెంట్ ఆఫీసర్ సెలవు లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. దీని తర్వాత పాకిస్తానీ అధికారులు ఇతడిని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పట్టుకున్నారు. పాకిస్తాన్ అధికారుల సహకారంతో ఈ అరెస్ట్ జరిగింది. ఇతడికి, పాక్ తాలిబాన్లతో సంబంధం ఉన్నట్లుగా తేలింది. బంగ్లా ఎయిర్ఫోర్స్లో తాలిబాన్కు సంబంధించి ఎవరున్నారనే వివరాలను కూడా బయటపెట్టాడు.
చిట్టగాంగ్లోని జహూరుల్ హక్ ఎయిర్ బేస్, ఢాకాలోని కుర్మిటోలాలో ఉన్న ఏ కే ఖండకర్ బేస్, జెస్సోర్లోని మతియుర్ రెహమాన్ బేస్ అనే మూడు కీలక స్థావరాలపై ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల పాటు దాడులు జరిగాయి. హూరుల్ హక్ ఎయిర్ బేస్లోని ప్రధాన మసీదు ఇమామ్ అయిన అబ్దుస్ షుకూర్ను, టీటీపీకి చెందిన ప్రధాన రిక్రూటర్గా దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే, ఈ నెట్వర్క్తో సంబంధాలు ఉన్న అధికారులు అరెస్టుల భయంతో టర్కీ, పాకిస్తాన్, న్యూజిలాండ్, పోర్చుగల్ పారిపోయారు.
