Australia: 15 ఏళ్లుగా వరసగా అత్యాచారాలు..అయినా పట్టుబడలేదు.. చివరకు ఇలా గుర్తించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australian police identify serial rapist, 40 years after first assault using DNA technology: ఆస్ట్రేలియాలో సీరియల్ రేపిస్టు ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. ఏకంగా 15 ఏళ్ల వ్యవధిలో 31 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. అయితే చివరకు టెక్నాలజీ ద్వారా నిందితుడిని గుర్తించారు ఆస్ట్రేలియా పోలీసులు. 40 ఏళ్ల క్రితం తను మొదటిసారిగా మహిళపై అత్యాచారాలను ప్రారంభించాడు. కీత్ సిమ్స్ 1985 నుంచి 2001 మధ్య మొత్తం 31 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే అతని కుటుంబ సభ్యులు మాత్రం ఆయన్ను ఓ మంచి తండ్రిగా, తాతగా, మంచి వ్యక్తిగా ఈ సమాజం పేర్కొనడం విశేషం.
‘ బీస్ట్ ఆఫ్ బోండి’ అని పోలీసుల చేత పిలువబడే సీరియల్ రేపిస్ట్ కీత్ సిమ్స్ 1985-2001 మధ్య అనేక మంది మహిళలను టార్గెట్ చేసి అత్యాచారాలు చేశాడు. జాగింగ్ కు వెళ్లే సమయంలో వారి ఇళ్లలోకి ప్రవేశించి, వారిపై దాడికి పాల్పడి అత్యాచారం చేసేవాడు. అయితే మొదట్లో ఈ నేరాలకు వేర్వేరు వ్యక్తుల కారణం అని పోలీసులు భావించారు. అయితే బాధితులు మాత్రం ఒకే రకమైన ఆధారాలు చెప్పడంతో ఇది ఓ సీరియల్ రేపిస్టు పనేనని ధృవీకరించుకున్నారు. ఈ కోణంలో సీరియల్ రేపిస్టుపై 2000 సంవత్సరంలో విచారణ ప్రారంభించారు. నిందితుడు ఫిబ్రవరిలో 66 ఏళ్ల వయసులో మరణించారు. నిందితుడు మరణించిన తర్వాత ఆయన నేరానికి పాల్పడింది అతడే అని పోలీసులు గుర్తించారు. తన భర్త రేపిస్టు అన్న సంగతిని ఇప్పటికే కీత్ సిమ్స్ భార్య నమ్మకలేకపోతోంది.
Also Read
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
- White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్హౌస్ కీలక ప్రకటన
- Haji Ali Ship: హోర్ముజ్ జలసంధిలో ఘోరం.. భారత నౌకను ముంచేసిన డ్రోన్ దాడి!
- Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
Read Also: Bombay High Court: విడాకుల కోసం భార్యకు హెచ్ఐవీ ఉందని అబద్ధం.. కోర్టు ఏం చేసిందంటే.?
డీఎన్ఏ టెక్నాలజీతో పట్టుబడ్డాడు:
14-55 ఏళ్ల మధ్య ఉన్న అత్యాచార బాధితులు అంతా దుండగుడి గురించి ఒకే రకమైన వివరాలు ఇచ్చారు. నిందితుడు సాధారణ దుస్తులు ధరించడంతో పాటు ముఖాన్ని కప్పి ఉంచుకునే వాడని బాధితులు వెల్లడించారు. ముదురు రంగులో ఉన్నాడని.. తనతో ఒక కత్తితో ఉందని, కత్తితో బెదిరించి అత్యాచారాలకు పాల్పడే వాడని తెలిపారు. ఈ వివరాల వల్ల వేల సంఖ్యలో ఉన్న అనుమానితులను చివరకు పోలీసులు 324 మందికి తగ్గించారు. పోలీస్ డేటాబేస్ లో ఉన్న డీఎన్ఏ వివరాలతో సిమ్స్ నమూనాలు సరిపోలడంతో కేసు చిక్కుముడి వీడింది.
మూడు దశాబ్ధాలుగా సిడ్నీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని గుర్తించారు. విషయం ఏంటంటే అతడిని కనుకునే సమయానికి అతడు మరణించడం కొసమెరుపు. 1985లో ప్రారంభం అయిన నిందితుడి నేర చరిత్ర 2001 వరకు కొనసాగింది. చివరిసారిగా స్థానిక శ్మశానవాటిక సమీపంలో నేరానికి పాల్పడ్డాడు.
తాజావార్తలు
-
PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
-
YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
-
Nizam Exhibitors: మేం పెద్ది సినిమాని టార్గెట్ చేయలేదు.. పర్సనల్ టార్గెట్ చేశారు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?