Ayodhya Ram Temple: రామమందిరంపై యూఎన్కి పాకిస్తాన్ మొర.. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోగలదా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరంపై పాకిస్తాన్ కడుపు మండుతోంది. దేశంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, పలువురు ముస్లింలు మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నప్పటికీ.. పాకిస్తాన్ భారత్పై విషప్రచారం చేస్తూనే ఉంది. ఇండియాలో మైనారిటీలో రక్షణ లేదు, ఇండియాలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతోందంటూ అసత్య మాటలు చెబుతోంది. మైనారిటీ హక్కుల్ని హరిస్తూ, ముస్లిం దేశంగా ఉన్న పాకిస్తాన్ ఇండియాకు సెక్యులరిజంపై నీతులు చెబుతోంది.
అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని యావత్ దేశం పండగలా జరుపుకుంది. దీన్ని చూసిన పాక్ తట్టుకోలేకపోతోంది. తాజాగా రామ మందిర నిర్మాణంపై ఐక్యరాజ్య సమితి(యూఎన్)లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ అధికారికంగా యూఎన్కి లేక రాసింది. రామ మందిరంపై ఐక్యరాజ్య సమితితో మొరపెట్టుకుంది. తినడానికి తిండి లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా కూడా పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై భారత్ని అభాసుపాలు చేసే పనులు చేస్తోంది.
Also Read
- China halts J10CE Delivery: భారత్ రఫేల్పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
Read Also: PM Modi: నితీష్ కుమార్, ఎన్డీయే ప్రభుత్వానికి ప్రధాని మోడీ అభినందనలు..
యూఎన్కి పాక్ ఏమని ఫిర్యాదు చేసింది..?
భారత్లో బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిరాన్ని నిర్మించి, ప్రతిష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు యూఎన్కి పంపిన లేఖలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ రాశారు. ఈ ధోరణి భారతీయ ముస్లింల సామాజిక, ఆర్థిక, రాజకీయ శ్రేయస్సుతో పాటు ఈ ప్రాంతంలో సామరస్యం, శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని ఆరోపించారు. భారత్ ఇస్లామిక్ వారసత్వ ప్రదేశాల రక్షణను నిర్ధారించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
భారత్లో ఇతర మసీదులు కూడా ఇదే రకమైన బెదిరింపులు ఎదుర్కొంటున్నాయని, వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు మరియు మథురలోని షాహీ ఈద్గా మసీదుతో సహా ఇతర మసీదులు కూడా అవమానాలు, విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నాయని ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో పాక్ పేర్కొంది. అయితే, ఇది భారత అంతర్గత విషయం కాబట్టి యూఎన్ ఇందులో కలుగజేసుకునే అవకాశం లేదు. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు అనంతరమే రామ మందిర నిర్మాణం జరిగింది.
తాజావార్తలు
-
Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
-
Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
-
Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!