US Election: అధ్యక్ష ఎన్నికల పోటీలో ట్రంప్కు మరో షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Election: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ పడాలనుకుంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాక్ తగిలింది. రిపబ్లికన్ పార్టీ తరపున 2024 అమెరికా ఎన్నికల్లో మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడాలని ఉవ్విళ్లూరుతున్న ట్రంప్కు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో ట్రంప్ హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న 64 ఏళ్ల మైక్ పెన్స్.. వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షుడి రేసు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ట్రంప్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
Read also: Hombale: కాంతర హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న ‘రాజ్ కుమార్’ వారసుడు
Also Read
2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున రంగంలోకి దిగాలని మైక్ పెన్స్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ అధ్యక్షుడైన సొంత పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా ప్రచారం మొదలు పెట్టారు. 2021లో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్స్ భవనంపై చేసిన దాడిని పెన్స్ తీవ్రంగా ఖండించారు. తాజాగా ఐయోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పెన్స్ ప్రసంగిస్తూ.. అమెరికాలో రాజ్యాంగం కంటే తామే ఎక్కువ అని భావించే వారు ఎవరైనా.. అధ్యక్షుడిగా ఎన్నికవ్వకూడదని.. ట్రంప్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఎవరైతే తమను రాజ్యాంగం కన్నా ఎక్కువగా పరిగణించాలని చూస్తున్నారో అటువంటి వారిని మరోసారి శ్వేత సౌధ అధిపతిగా ఎంచుకోకూడదని సొంత పార్టీ నేతలకు.. అమెరికా ఓటర్లకు సూచించారు.
Read also: Minister KTR : కొత్తకోట, దేవరకద్రలో ప్రభుత్వ ఆసుపత్రులు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న మైక్ పెన్స్.. ట్రంప్ను సమర్థించేవారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, ఆయనపై వచ్చిన వివాదాలను ఎప్పటికప్పుడు కప్పిపుచ్చేవారు. అలాంటి మైక్ పెన్స్.. ఇప్పుడు ధైర్యంగా ట్రంప్కు వ్యతిరేకంగా మాట్లాడటం పట్ల విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్యాపిటల్ హిల్స్ భవనంపై దాడిని రాజకీయ విషపూరితమైన.. భయంకరమైన ఘటనగా పెన్స్ అభివర్ణించారు. అయితే పెన్స్ చేసిన వ్యాఖ్యలు.. ట్రంప్పై వ్యతిరేకంగా ఉన్న వారిని తనవైపు ఆకర్షించేందుకు బాగా సహకరిస్తాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అధ్యక్ష పదవి పోటీ కోసం ట్రంప్, పెన్స్తోపాటు రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి మరొకొంత మంది ఎదురు చూస్తున్నారు. నార్త్ డకోటా గవర్నర్ డగ్ బర్గమ్ కూడా రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్నట్లు మంగళవారం ప్రకటించారు.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!