Iran: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఆయన స్వస్థలం మషాద్లో ముగిశాయి. భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు ఆయనకు అంతిమ నివాళులు అర్పించారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ చేసిన దాడిలో ఖమేనీ మరణించారు. ప్రస్తుత సుప్రీం లీడర్, అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు.
ఇదిలా ఉంటే, ఖమేనీ శవపేటికను తీసుకెళ్తున్న విమానానికి ఫైటర్ జెట్లు ఎస్కార్ట్ ఇచ్చినట్లు ఇరాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన వీడియోనున ఖమేనీ అధికారిక వెబ్సైట్ పోస్ట్ చేసింది. ఖమేనీ శవపేటికతో పాటు దాడిలో మరణించిన ఆయన కుటుంబ సభ్యుల శవపేటికల్ని మషాద్కు తరలించారు. గత ఆరు రోజులుగా ఇరాన్ పలు నగరాల్లో అంతిమయాత్ర నిర్వహించారు. చివరకు గురువారం మషాద్ లోని ఇమామ్ రెజా దర్గా వద్ద ఖనం చేశారు. ఖమేనీ కోరిక మేరకు ఆయన స్వస్థలంలోనే ఖననం చేసినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది.

