Germany: పారిశ్రామిక రంగంలో చైనాకు షాక్… సరికొత్త ప్లాన్తో జర్మనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Germany: పారిశ్రామిక రంగంలో చైనాకు పెద్ద షాక్ తగలనుంది. చైనాకు షాకిచ్చేందుకు ఐరోపాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ సిద్ధమైంది. కీలక రంగాల్లో ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు జర్మనీ ప్లాన్ను సిద్ధం చేసింది. ఈ మేరకు ‘స్ట్రాటజీ ఆన్ చైనా’ పేరిట 40 పేజీల వ్యూహపత్రాన్ని గురువారం విడుదల చేసింది. దీనిలో బీజింగ్పై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు బెర్లిన్ అనుసరించాల్సిన కఠిన నిబంధనలను వెల్లడించింది.
Read also: Neha Malik Pics: పింక్ డ్రెస్లో పిచ్చెక్కిస్తున్న నేహా మాలిక్.. హాట్ పిక్స్ వైరల్!
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
‘‘చైనా మారిపోయింది. ఆ దేశ రాజకీయ నిర్ణయాలు, మార్పుల కారణంగా మేము కూడా చైనా విషయంలో అనుసరించే వైఖరిని మార్చుకోవాల్సి ఉంది’’ అని ఆ వ్యూహపత్రంలో జర్మనీ పేర్కొంది. తన స్వప్రయోజనాలను కాపాడుకోవడానికి చైనా తీవ్రంగా పనిచేస్తోందని.. ఇందు కోసం అంతర్జాతీయ నిబంధనలు కూడా మార్చేందుకు ప్రయత్నించడం ప్రపంచ భద్రతకు ఇబ్బందికరంగా మారిందని ఆ పత్రంలో పేర్కొంది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ నేతృత్వంలోని మూడు పార్టీల కూటమి ప్రభుత్వం కొన్ని రోజులపాటు మల్లగుల్లాలు పడి చివరికి దీనికి ఆమోద ముద్రవేసింది. చైనాలో వ్యాపారం, పెట్టబడులను కొనసాగిస్తూనే.. ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ప్రధానంగా ఔషధాలు, విద్యుత్తు కార్లలో వాడే లిథియం బ్యాటరీలు, చిప్స్ తయారీ ముడిసరుకుల విషయంలో దీనిని అమలు చేయనుంది. ఈ వ్యూహ పత్రంపై దేశ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ట్వీట్చేశారు. తాము చైనా నుంచి విడిపోవాలనుకోవడంలేదని.. కానీ, కీలక విషయాల్లో ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకొంటున్నామని దేశ ఛాన్సలర్ ట్వీట్ లో పేర్కొన్నారు. చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలు పెరిగాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. బెర్లిన్కు బీజింగ్ అత్యంత కీలకమైన వ్యాపార భాగస్వామి అన్న విషయం తెలిసిందే. 2022లో ఇరుదేశాల మధ్య 300 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!