Germany: పారిశ్రామిక రంగంలో చైనాకు షాక్… సరికొత్త ప్లాన్తో జర్మనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Germany: పారిశ్రామిక రంగంలో చైనాకు పెద్ద షాక్ తగలనుంది. చైనాకు షాకిచ్చేందుకు ఐరోపాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ సిద్ధమైంది. కీలక రంగాల్లో ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు జర్మనీ ప్లాన్ను సిద్ధం చేసింది. ఈ మేరకు ‘స్ట్రాటజీ ఆన్ చైనా’ పేరిట 40 పేజీల వ్యూహపత్రాన్ని గురువారం విడుదల చేసింది. దీనిలో బీజింగ్పై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు బెర్లిన్ అనుసరించాల్సిన కఠిన నిబంధనలను వెల్లడించింది.
Read also: Neha Malik Pics: పింక్ డ్రెస్లో పిచ్చెక్కిస్తున్న నేహా మాలిక్.. హాట్ పిక్స్ వైరల్!
Also Read
- Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
‘‘చైనా మారిపోయింది. ఆ దేశ రాజకీయ నిర్ణయాలు, మార్పుల కారణంగా మేము కూడా చైనా విషయంలో అనుసరించే వైఖరిని మార్చుకోవాల్సి ఉంది’’ అని ఆ వ్యూహపత్రంలో జర్మనీ పేర్కొంది. తన స్వప్రయోజనాలను కాపాడుకోవడానికి చైనా తీవ్రంగా పనిచేస్తోందని.. ఇందు కోసం అంతర్జాతీయ నిబంధనలు కూడా మార్చేందుకు ప్రయత్నించడం ప్రపంచ భద్రతకు ఇబ్బందికరంగా మారిందని ఆ పత్రంలో పేర్కొంది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ నేతృత్వంలోని మూడు పార్టీల కూటమి ప్రభుత్వం కొన్ని రోజులపాటు మల్లగుల్లాలు పడి చివరికి దీనికి ఆమోద ముద్రవేసింది. చైనాలో వ్యాపారం, పెట్టబడులను కొనసాగిస్తూనే.. ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ప్రధానంగా ఔషధాలు, విద్యుత్తు కార్లలో వాడే లిథియం బ్యాటరీలు, చిప్స్ తయారీ ముడిసరుకుల విషయంలో దీనిని అమలు చేయనుంది. ఈ వ్యూహ పత్రంపై దేశ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ట్వీట్చేశారు. తాము చైనా నుంచి విడిపోవాలనుకోవడంలేదని.. కానీ, కీలక విషయాల్లో ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకొంటున్నామని దేశ ఛాన్సలర్ ట్వీట్ లో పేర్కొన్నారు. చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలు పెరిగాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. బెర్లిన్కు బీజింగ్ అత్యంత కీలకమైన వ్యాపార భాగస్వామి అన్న విషయం తెలిసిందే. 2022లో ఇరుదేశాల మధ్య 300 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి.
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!